ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారా, రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1923 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1958 General Articles and views 1,587,967; 97 తత్వాలు (Tatvaalu) and views 199,689.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మహాభారతం లో మనకు తెలియని కథలెన్నో దాగి ఉన్నాయి

జూదం, ద్రౌపది వస్త్రాభరణం, కురుక్షేత్ర యుద్ధం వీటినే చూపెడతారు ఎప్పుడూ. నిజానికి ఇప్పటి ఈ సమాజానికి కావాల్సిన నీతికథలు, ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి ఇది.

ఇప్పుడు ఎంత అప్పు ఉంటే, అతను అంత గొప్పవాడు. ఎంత మంది సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే, పంచుతూ ఉంటే, అంత గొప్పవారు కదూ?

పంచ పాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు, తనకంటే ఎక్కువ ధానం చేసిన వాళ్ళు ఇంకెవరు లేరని, ధర్మరాజు అభిప్రాయం. ఇదే ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది.

అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని, వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు. ఆ రాజ్యాన్ని మహాబాల చక్రవర్తి పాలిస్తూ వచ్చారు. అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక, ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది.

ధర్మరాజు ఆమెతో ఏంటమ్మా, బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా అని చెప్పడంతో, ఆమె మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము, అని బదులు చెప్పి వెళ్ళిపోయింది. అంటే, ఎంత సంపద ఉందో ఆలోచన చేయండి.

ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ, ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు. కృష్ణుడు మహాబలరాజు తో ధర్మరాజును, ఈ విధంగా పరిచయం చేసాడు.

రాజా! ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు.

కృష్ణా, మీరు చెప్పిన విషయం సరే, కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నదీ, అందరి దగ్గర సంపద బాగా ఉన్నదీ. నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం. ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందువల్ల దానధర్మాలకు ఇక్కడ స్థలం లేదు. ఇక్కడ ఎవరికీ ధానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు.

ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు, అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో.

ఈయన రాజ్యంలో అంతమందిని, పని లేదా వ్యాపారం లేకుండా, పేదవారిగా ఉంచినందుకు, ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు.

తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు. సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం. ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం, ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా వివరించారు.

మరి మన పాలకులు మరియు ప్రజలు ఎప్పుడు దీని అర్ధము తెలుసుకుంటారో, ప్రజలు ఎప్పుడు మారుతారో.

సేకరణ సవరణ  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1958 General Articles and views 1,587,967; 97 తత్వాలు (Tatvaalu) and views 199,689
Dt : 17-Jan-2021, Upd Dt : 17-Jan-2021, Category : Devotional
Views : 700 ( + More Social Media views ), Id : 929 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ashamed , face , king , poor people , no work , kingdom , krishna , dharmaraju
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content