బ్రాహ్మణులు మొఖం, క్షత్రియులు భుజం, వైశ్యులు ఊరువులు, శూద్రులు పాదాలు, వర్ణ లోపం ఉందా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1766 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1801 General Articles and views 1,394,093; 94 తత్వాలు (Tatvaalu) and views 184,767.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

బ్రాహ్మణులు మొఖం, క్షత్రియులు భుజం, వైశ్యులు ఊరువులు (తొడలు), శూద్రులు పాదాలు లాంటి వారని/ పోలిక/ అని, వేదం లో ఉంది. ఇందులో వర్ణ లోపం లేదా ఒక వర్ణం ఎక్కువ తక్కువ, అభిప్రాయం ఉందా?

జవాబు, మనం ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, ప్రజలు అని 4 వర్ణాలను, అందరం అంగీకరించి ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో లోపం, ఎక్కువ, తక్కువ ఉందా? మీరే చెప్పండి.

పాశ్చాత్య దేశాల్లో తేడా లేదు. మన దగ్గర ప్రజాస్వామ్య సిద్దాంతం ప్రకారం, పుస్తకాలలో కూడా తేడా లేదు, ఎక్కువ తక్కువ లేదు. కానీ ఆచరణలో మాత్రం ఉంది, అది కేవలం మన బుద్ధి ఆలోచన అవగాహన లోపమే.

మనం, ముఖ్యమంత్రి ముఖం లాంటి వారు, మంత్రులు భుజం లాంటి వారు, ఎమ్మెల్యేలు ఊరువు లాంటి వారు, ప్రజలు పాదాలు లాంటి వారు అంటే, లోపం, ఎక్కువ, తక్కువ ఉందా?

పదవి లేదా వర్ణం పుట్టుకతో వస్తుందా? లేక కృషి తో సాధించిన వస్తుందా? ప్రజలు ఓటేసి అంగీకరించారు కాబట్టే ఆ పదవి వచ్చింది, పుట్టుకతో రాదు కదా? సమస్య ఎక్కడ వస్తుంది అంటే, ముఖ్యమంత్రి కొడుకు అదే కావాలని, మంత్రి కొడుకు అదే కావాలని, ఎమ్మెల్యే కొడుకు అదే కావాలంటే, అప్పుడు అరాచకం వర్ణాలు మధ్యలో గొడవలు, అనవసరపు తలనొప్పులు వస్తాయి. అంటే శాస్త్రం లో తప్పు లేదు, మన చెడుబుద్ది లో లోపం ఉంది.

బయట రాష్ట్ర ముఖ్యమంత్రి, కేవలం మన ముఖ్యమంత్రి తోనే ముందుగా మాట్లాడతారు. కాబట్టి మొఖం అన్నా. బయటకు కనపడేవాడు, తెలివైన వాడు, నాయకుడు కాబట్టి, మొఖం అన్నాను. శాఖల పరంగా, జిల్లా ల పరంగా తిరిగి పనిచేసే మంత్రులు ను, భుజాల తో పోల్చాను. ప్రజల కు దగ్గరగా, వ్యవహారాలు లో ఉండే ఎమ్మెల్యేలును ఊరువులు తో, పోల్చాను. వీరందరికీ మూలం, వీరందరికి ఆ శక్తి ని ఇచ్చిన వారు, అంటే పై వారంతా అంటే ముగ్గురు వచ్చింది, ప్రజల నుంచి కాబట్టి, మూల స్ధంబం, కాళ్ళు పాదాలు అని అన్నా.

ఇప్పుడు చెప్పండి ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ? కాళ్ళు పాదాలు తక్కువ అయితే, ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్యే వచ్చింది, పాదాలు లాంటి ప్రజల మధ్య నుంచి కాదా? అంటే వారూ, తక్కువ వారే కదా? ఎవరు ఎవరిని అవమానిస్తున్నారు? ప్రజల నుంచి వచ్చిన వారే క్రుతజ్ఞతలు మరచి, ప్రజలను అవమానిస్తున్నారు. శాస్త్రం ప్రజాస్వామ్యం, కాదు కదా ప్రజలను అవమానిస్తుంది? కాళ్ళు లేకుండా ఉండగలమా?

నేను బ్రహ్మణుని కాను, కానీ గతంలో గుంటూరు దగ్గర గ్రామం మొత్తం, నన్ను పంతులుగారు అని గౌరవించి, చిన్న గుడి లో, ఉచిత పూజారి ని చేశారు, నీ గుణ కర్మలు మాకు నచ్చాయి పర్లేదు లే అని. ఆ ఊరి, పెద్ద ఆచార్యులు కూడా దానిని గౌరవించి, నాతో పక్కన కూర్చుని, ఊరంతా చూస్తుండంగా బహిరంగంగా, ఇద్దరం వేదం చదువుతూ, దేవీ నవరాత్రులు పూజ, 9 రోజులు 9 మంది దంపతులచే ఆచరింప చేశాము. ఇందులో లోపం, ఎక్కువ, తక్కువ ఉన్నాయా? బ్రాహ్మణత్వం పౌరోహిత్యం పుట్టుకతో వస్తుందా? ఈ ఉదాహరణలో, పుట్టుక తో వచ్చిందా?

ఒక కంపెనీ లో, జనరల్ మేనేజర్, డిపార్ట్మెంట్ హెడ్, సెక్షన్ హెడ్, కార్మికులు అని 4 వర్ణాలు ఉన్నాయి. అందులో లోపం, ఎక్కువ, తక్కువ ఉందా? ఉంటే, కంపెనీ నడుస్తుందా? గుణ కర్మలు అర్హతలు బట్టి, వర్ణాలు పదవులు ఇచ్చారు. పుట్టుకను బట్టి కాదు. మేనేజర్ కొడుకు మేనేజర్ కావాలంటే? కార్మికుల కొడుకు కార్మికుడే కావాలంటే, అక్కడ గొడవ మొదలు అవుతుంది. అలా అనకూడదు కదా. కాబట్టి పుట్టుక అర్హతకు, కారణం కారాదు.

ఇప్పుడు నేను కధనాలు రాసి రచయిత గా, విలేఖరి గా, ఎమ్మెల్యే ఎంపీలు సీఎం పీఎం మంత్రులు కలెక్టర్ అధికారులు కు పంపుతున్నా, పుట్టుకతో రచయిత విలేఖరి నా? పత్రిక అధిపతి కే, నేను లేదా ఇతర రచయితలు విలేఖరులు, పుట్టి ఉండాలా?

వేదం చెప్పిన దాని అర్థం, పుట్టుకతో అందరూ శూద్రులే, అందరూ ఒకటే, అందరూ పాదాలే. వారి వారి, ధర్మ నీతి నియమ గుణ కర్మలను బట్టి, ధర్మ వ్యాపారం చేసే వారు వైశ్యులు అన్నారు. ఇది కులం కాదు. అంటే వ్యాపారం చేయని వారు, వైశ్యులు కాదు కదా, వారూ శూద్రులే.

ప్రాణాలను పణం గా పెట్టి, భుజ బలం తో శత్రువులను జయించి, రాజ్యాన్ని ఏలే వారు, సైన్యం లో ఉండేవారు, క్షత్రియులు అన్నారు. అంటే బలం లేక, రాజ్యం లేదా సైన్యం లో భాగం కాని వ్యక్తి, గమ్ముగా ఇంట్లో కూర్చునే వ్యక్తి, క్షత్రియుడు కాడు కదా?

అలాగే వేదాలు పురాణాలు చదివి, కంఠస్ధం చేసి, అవగాహన చేసుకుని, ఇతరులకు ఉచితము గా నేర్పిస్తూ, యజ్ఞ యాగాదులు చేస్తూ, శాస్త్రం ను బట్టి, ధర్మం నీతి నియమాలను ఆచరిస్తూ ఉండే వారు, బ్రాహ్మణులు. అవి అన్ని వదిలేసి, అలాంటి వి ఏమీ చేయని వారు, శూద్రులే కదా.

అంటే ఈ నాలుగు వర్ణాలు పుట్టుకతో రావు, కేవలం పుట్టిన తర్వాత తాము ఆచరణలో పెట్టే, తమ గుణ కర్మలు ను బట్టి, మాత్రమే వస్తాయి.

కానీ ప్రతి విషయాన్ని వక్రీకరించి, మనకు అనుకూలంగా వాడుకోవచ్చు అన్న దుర్భుద్దితో, కొంతమంది ఆడిన నాటకాలు తప్పుడు పద్దతులు, సమాజంలో ఎక్కువ తక్కువ లు తేడాలు, తీసుకుని వచ్చాయి. ఇది శాస్త్రం ధర్మం అంగీకరించదు.

వాల్మీకి బోయవాడు శూద్రుడు పుట్టుకతో, తర్వాత తన, గుణ కర్మలతో బ్రాహ్మణుడు అయ్యాడు. కృష్ణుడు రాజు గా పుట్టి యాదవుడు గా పెరిగినా, బ్రాహ్మణోత్తముడిగా గౌరవించారు, పూజలు చేసారు. విశ్వామిత్రుడు క్షత్రియుడు అయినా, బ్రాహ్మణుడుగా గౌరవించారు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు పురాణాలలో, వేదాలలో.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,093; 94 తత్వాలు (Tatvaalu) and views 184,767
Dt : 17-Dec-2020, Upd Dt : 17-Dec-2020, Category : General
Views : 904 ( + More Social Media views ), Id : 864 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : brahmins , face , kshatriyas , shoulder , vaishyas , thighs , shudras , feet , high , low , respect , issues , correct , wrong
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content