శ్రమ ప‌రిశ్ర‌మ‌ చంద్ర‌న్నది, ఆర్భాట ప్ర‌చారం జ‌గ‌నన్నది అంటున్న లోకేష్ - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,056; 104 తత్వాలు (Tatvaalu) and views 225,555.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* మే 2019 నుంచి పరిశ్రమల జాబితా మేకపాటి
* పెట్టుబడులు రూ.29,780.86 కోట్లు
* 45,049 మందికి కొత్తగా ఉపాధి

* ఆ కంపెనీల లిస్ట్ ను లోకెష్
* సొమ్మొక‌డిది సోకొక‌డిది
* చంద్రన్న నానా క‌ష్టాలు, ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు
* 15.45 లక్షల కోట్ల పెట్టుబడి, 32 లక్షల ఉద్యోగాలు
* రెండేళ్ల అరాచ‌క‌పాల‌న‌తో భారీ పరిశ్రమలు ఇతర
* క్వారీలపై దాడులు, భారీ పెనాల్టీలు
* అదానీలు వెన‌క్కి
* విదేశాలలోనూ ఏపీ అప‌కీర్తి, ఆగిన పెట్టుబ‌డులు
* జే ట్యాక్స్ వేధింపు
* అధికారిక డాక్యుమెంట్లతో ప్ర‌జ‌ల‌ ముందు
2 min read time.

*** మే 2019 నుంచి మే 2021 వరకూ సీయెం జగనన్న నాయకత్వంలో, గ్రౌండ్ అయిన పరిశ్రమల వివరాల జాబితా ను, పరిశ్రమల మంత్రి మేకపాటి విడుదల చేసారు. గత రెండేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.29,780.86 కోట్లు, తద్వారా 45,049 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు వచ్చింది అన్నారు. లింక్ లో చూడండి. Mekapati.

*** అయితే, ఆ కంపెనీల లిస్ట్ ను లోకెష్ తప్పు పట్టారు. న‌వ్యాంధ్ర ముఖ్య‌మంత్రిగా చంద్రన్న గారు దేశ‌విదేశాలు తిరిగి, ప్ర‌ఖ్యాత కంపెనీల్ని ఒప్పించి, తెప్పించిన ప‌రిశ్ర‌మ‌ల్ని జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో వ‌చ్చాయ‌ని, డ‌ప్పు కొట్టుకోవ‌డం సిగ్గుచేటు అన్నారు.

సొమ్మొక‌డిది సోకొక‌డిది అన్న చందాన ఉంది వీళ్ళ వాలకం అంటూ మేకపాటి మరియు జగన్ ల పై, లోకేష్ విరుచుకు పడ్డారు.

నానా క‌ష్టాలు ప‌డి, ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయించింది, చంద్రన్న అయితే, నిస్సిగ్గుగా తామే తెచ్చామ‌ని ప్ర‌క‌టించుకున్న జ‌గ‌న్‌రెడ్డిని, ఫేక్ సీఎం అనిపించుకున్నార‌న్నారు.

జ‌గ‌న్‌రెడ్డి రెండేళ్ల అరాచ‌క‌పాల‌న‌లో ఒక్క కంపెనీ రాక‌పోవ‌డంతో, చంద్ర‌బాబు తీసుకొచ్చిన కంపెనీ లైన కియా, హీరో మోటార్స్, అశోక్ లేల్యాండ్, ఇసుజు, అపోలో టైర్స్, మోహన్ spintex, Tory, TCL తో పాటు మొత్తం 16 కంపెనీలు, సంస్థ‌లు తామే తెచ్చామ‌ని ప్ర‌క‌టించుకుని మేకపాటి గౌతం రెడ్డి మరియు వైసీపీ స‌ర్కారు అభాసుపాలైంద‌న్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3 సార్లు పారిశ్రామిక సదస్సులు నిర్వహించి 15.45 లక్షల కోట్లరూపాయల పెట్టుబడులు, 32 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించామ‌న్నారు.

ఐదేళ్ల టిడిపి ప్ర‌భుత్వం కృషితో 5 ల‌క్ష‌ల 13 వేల ఉద్యోగాలు వ‌చ్చాయ‌ని, జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారే శాస‌న‌మండ‌లి సాక్షిగా వెల్ల‌డించింద‌న్నారు.

ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు గారు ఎన్నో క‌ష్టన‌ష్టాల‌కోర్చి తెచ్చిన పెట్టుబ‌డుల్ని, జ‌గ‌న్‌రెడ్డి రెండేళ్ల అరాచ‌క‌పాల‌న‌తో 17 లక్షల కోట్లరూపాయల విలువైన భారీ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు పంపించారు.

వైసీపీ నేత‌ల బెదిరింపుల కారణంగా రూ.2వేల కోట్ల పెట్టుబడులతో వచ్చే 17 కియా అనుబంధ సంస్థలను ఇత‌ర రాష్ట్రాల‌లో ఏర్పాటు చేసుకుంటున్నారు.

వేలాది మందికి ఉపాధి క‌ల్పిస్తోన్న కడపలో జువారి సిమెంట్స్, చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ వంటి ప్రతిష్టాత్మక పారిశ్రామిక సంస్థలను పిసిబి నోటీసులతో మూసివేసే ప్రయత్నాలు చూశాక, కొత్త ప‌రిశ్ర‌మ‌లు స్థాపించేందుకు ఎవ‌రైనా ఏపీ కి వస్తారా?

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నేతల క్వారీలపై దాడులు చేసి భారీగా పెనాల్టీలు వేసి గ్రానైట్ పరిశ్రమల సంక్షోభానికి కార‌ణ‌మ‌య్యారు.

కంపెనీల‌కు రాయితీలు ఇవ్వాల్సిన ప్ర‌భుత్వ పెద్ద‌లే క‌మీష‌న్ల కోసం వేధించ‌డంతో రేణిగుంటలో రిలయన్స్‌ జియో రూ.15 వేల కోట్ల పెట్టుబ‌డి, ఒంగోలులో రూ.24 వేల కోట్లతో ఏర్పాటు కావాల్సిన ఇండోనేషియా పేపర్‌ కంపెనీ, విశాఖలో డేటా సెంటర్ స్థాపన కోసం రూ.70 వేల కోట్ల పెట్టుబడికి సిద్ధమైన అదానీలు వెన‌క్కి తగ్గారు.

రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే సింగపూర్‌ స్టార్టప్‌ కంపెనీలు ఒప్పందాలను రద్దు చేసుకోవ‌డం వల్ల విదేశాలలోనూ ఏపీ అప‌కీర్తి మూట‌క‌ట్టుకోవ‌డంతోపాటు, ఏపీ లో పెట్టుబ‌డులు పెట్టాలంటేనే భ‌య‌ప‌డిపోయే ప‌రిస్థితి తీసుకొచ్చారు.

ఏపితో ఒప్పందం చేసుకుని కూడా, హోలీ టెక్ కంపెనీని ఉత్తర్ ప్రదేశ్ వెళ్ళిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం జే ట్యాక్స్ వేధింపులేన‌న్నారు.

ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్, హెచ్ ఎస్ బిసిల‌ను బెదిరించి మ‌రీ పంపేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వాకం కారణంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి రేటు -2.58కి, జిఎస్డిపి -3.26కి పడిపోయింది.

దేశం మొత్తంమీద సగటు నిరుద్యోగిత రేటు 11.9 ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 13.5కి చేరుకుంది.

జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం రెండేళ్ల‌లో తెచ్చిన కంపెనీలంటూ ఈ రోజు విడుద‌ల చేసిన జాబితా మొత్తం ఏపీ ప్ర‌జ‌లు ప‌రిశీలించాలి. ఈ కంపెనీల‌న్నీ 2015 నుంచి చంద్రబాబు గారు తెచ్చిన‌వి, అప్పుడు చేసుకున్న ఒప్పందాల మేర‌కు వ‌చ్చినవే.

ఏ కంపెనీకి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందీ అన్న వివరాలు రాష్ట్ర ప్రభుత్వం విడుద‌ల చేసిన‌ అధికారిక డాక్యుమెంట్లతో సహా ప్ర‌జ‌ల‌ ముందు పెడుతున్నాము.

ఎవ‌రు రాష్ట్రాభివృద్ధికి, పారిశ్రామికాభివృద్ధికి కృషి చేశారో నిర్ణ‌యించుకోవాల‌ని నా మనవి, అని లోకేష్ ప్రజలకు 72 డాక్యుమెంట్లను అందించారు. లింక్ లో చూడగలరు. Lokesh.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,056; 104 తత్వాలు (Tatvaalu) and views 225,555
Dt : 09-Jun-2021, Upd Dt : 09-Jun-2021, Category : Politics
Views : 802 ( + More Social Media views ), Id : 1197 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chandranna , hardwork , industries , fake , campaign , mekapati , jagan , lokesh
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content