Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *ఏవండీ అందరూ మాకే నీతులు చెపుతారు. మా ధనము తో మేము బతుకుతూ ఉంటే, ఇంకొకరు ఎందుకు చెప్పాలి, అవి మేమెందుకు వినాలి? మా ఇష్టం వచ్చినట్లు గా ఉంటాము, తిరుగుతాము. మధ్యలో వారికెందుకు.*
లేదా *అరిషడ్వర్గాలకు బానిసలం అయి, పంచభూతాలా సాక్ష్యం తుడపగలమా? పెద్దల మాట సద్ది మూట, వినలేమా? ఐతే, గురువు మాట ఎలా వినగలం, ఆచరించగలం?*
జవాబు - మీ బాధ అర్ధం అయ్యింది, మనము అరిషడ్వర్గాలకు బానిసలం అయినప్పుడు, ఇలాగే అనిపిస్తుంది. ఒకరితో మాకేటి, ఒకరి మాట మేమెమందుకు వినాలి.
అందుకే, ధ్యానం లో మనల్ని మనమే చూసుకుంటూ, మన తప్పుల్ని మనమే సరిచేసుకుంటూ, జీవితం పంచభూతాల సాక్ష్యం తో, ముందుకు ప్రతి అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఒకసారి తప్పు చేస్తే, పంచభూతాల సాక్ష్యం తుడపలేము. తస్మాత్ జాగ్రత్తలు.
మనము అనుకునేవి మాత్రమే, కరెక్ట్ కావు. ధుర్యోధనుడు, రావణుడు వారు చేస్తున్నది కరెక్టే అనుకున్నారు, వారికి గురువులు ఉన్నా కూడా, వారి జీవితం ముగిసిన దాకా.
పక్కింటి లేదా మన ఇంట్లో వారు, మనల్ని బాగా చదువుకో, ఇంట్లో అమ్మా నాన్నకు సహాయం గా ఉండు, ముదుసలి వారి సేవ చెయ్యి, టీవీ చూడకు, ఫొన్ నెట్లో చావకు, గాలికి బయట తిరిగి కరోనా తీసుకు రాకు, పెద్దలకు చెప్పకుండా కొత్త పనులు చేయవద్దు, తాగి పోకు, పనికి రాకుండా ఉండకు, పదిమంది మంచి కోరు, తెలుగు రాయి, మంత్రం/ శ్లోకం చదువు, ముదుసలి అమ్మ/నాన్న ను చూడు, అని చెప్పినా కోపము వస్తుంది కదూ. మనం కరోనా లేదా అర్ధరాత్రి సమయములో, రోడ్ మీద బాదిన పోలీసు మీద కూడా కోపమే.
కానీ ఇవన్నీ తప్పులు గా చేసే, మన మీద మాత్రం కోపం రాదు, కదూ? అన్ని వయసుల వారిది ఇదే బాధ సుమీ. ఆఖరికి భాగస్వాములు, తోబుట్టువులు మరియు తల్లి దండ్రులు కూడా అడగకూడదు, అంతేనా? ఇంకా పూర్తి విచ్చలవిడి స్వేచ్చ కావాలి, పతనానికి, అంతేనా?
మన ప్రశ్నలు బట్టే, మన సంస్కారము, అహంకారం అందరికీ తెలుస్తుంది. చాలా మంది, మాకు అంతా తెలుసు, ఎవరూ మాకు చెప్పక్కరలేదు అనుకుంటారు. కానీ వాస్తవానికి మోహము లో వారికి ఏమీ తెలీదు, జరగబోయేది, వారు గుర్తించలేరు.
రామన్న, రాజన్న, చంద్రన్న, జగనన్న, మీరు, మేము, ఇంకా ఎందరో ఉన్నారు, ఉదాహరణలు గా. జనం ఓట్లతో గెలిచి, జనం ధనం తో, పధకాల పేర్లతో, కులికే నాయకులు అధికార్లు కూడా అదే మాట అంటున్నారు, మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి అని.
అందుకే, తెలిసిన పలికే గురువు కావాలి అనేది. కానీ ఇంట్లో అమ్మ నాన్న మాట వినము, తెలిసిన వారి మాట వినం, ఇంక బయట గురువుల మాట వింటామా? ఆచరిస్తామా?
గురువులు గా మీ అందరికీ చెప్పాము, అమ్మ విషయము లో ఏదైనా అజాగ్రత గా ఉంటే, మమ్మల్ని మీరు అందరూ ప్రశ్నించ వచ్చు అని.
ఇప్పుడు మీ ప్రశ్నకు, మా ప్రశ్నకు తేడా ఏమిటో అర్ధం అయ్యిందా? కేవలం సంస్కారం, మంచిపై నమ్మకం, అంతే కదా?
మరి అమ్మ విషయము లో, మీరంతా ఎందుకు ప్రశ్నించాలి అని, మేము అనవచ్చునా, సరదాకైనా?
మేము కరెక్ట్ గా చేస్తున్నపుడు, ఎవరు ప్రశ్నించినా తప్పు ఏముంది? మా దగ్గర 10 మంది సాక్ష్యం తో జవాబు ఉంది. మాకు తెలిసిన వారు, అన్ని విషయాలు పంచుకున్న వారే, ప్రశ్నిస్తారు. తప్పు ఏముంది?
మన తప్పు ఉంటే, సరి చేసుకుందాము. మనకు పోయిన దేముంది? ప్రపంచము లో అనుభవజ్ఞులైన ఎవరో ఒకరి, మాట వినని వారు, పతనము చెందుతారు.
పోనీ ఎవరు వచ్చి అడిగితే, మనము జవాబు చెపుతాము? ముఖ్యమంత్రా, ఎంపీనా, ఎమ్మెల్యేనా? వాళ్ళు వచ్చి, మీకు మాకు, ఎందుకు చెపుతారు నీతులు? వారి విషయాలకే, వారికి తీరిక లేదు, 5 ఏళ్ళ తర్వాత వారికే భవిష్యత్ తెలీదు. అసలు వారికి అవసరం ఏముంది? వారినీ అంటాము గదా, మా విషయాలు మీకెందుకు అని, మన పార్టీ కాకపోతే.
అంటే పూర్తి గా, బయట వారు ఎవరూ వచ్చి, మిమ్ము మమ్ము క్షేమ సమాచారం అడగరు, చెప్పరు, అవసరం లేకుండా.
మనకు తెలిసిన వాళ్ళే, మన గురించి పూర్తి గా అవగాహన ఉన్న వారే, మనము తప్పు చేస్తుంటే చెపుతారు, అడుగుతారు.
నచ్చితే పాటించు. నచ్చకపోతే, విని గమ్ము గా ఉండు, అవి పెద్దల మాటలు అయితే. చిన్న వారు అయితే, నీ మంచి గురించి చెప్పి, మేము జాగ్రత్త గానే ఉన్నాము అని మర్యాద గా చెప్పు. ఎవరినీ ఎదిరించకు, దూరం చేసుకోకు. వారితో ఎప్పుడు అయినా, పని రావచ్చు.
ఇక్కడ మనుషుల తో కాదు భయం బాధ, మన ప్రతి అరిషడ్వర్గం బానిసత్వం, పంచ భూతాలు రికార్డ్ చేస్తున్నాయి. వాటికి శిక్షలు తప్పక వస్తాయి, కొంచెం వెనకా ముందు అంతే.
3 ఏళ్ళు పై గా మాతో కొందరు పలకకపోయినా జవాబు చెప్పకపోయినా, నవ్వుకుంటూ వారిని, ఈ సందేశాలతో పలకరిస్తూనే ఉన్నాము కదా, అలాగే ఉండాలి. పుణ్యం మనకు.
మనల్ని ప్రశ్నించే వాడే, మన గురువు. అసలే పట్టించుకోకుండా, చెడిపోతున్న వారు ఎందరో ఉన్నారు. వారు తర్వాత పతనం అయితే, ఎవరు జాలి కూడా చూపరు. మనల్ని అడిగే వాడు దొరకడం, మన అద్రుష్టం. వారే మన అమ్మా నాన్న అన్న అక్క లాంటి వారు.
ఎందుకంటే, ఎవరి స్వార్ధ పతనం లో వారు ఉండి, ఎవరికీ తీరిక లేదు ఈ రోజుల్లో ఇంకొకరి బాగు అడగడానికి, ప్రశ్నించడానికి. వారి తల్లి దండ్రులనే పక్కన పెట్టుకుని చూడరు, వారి పిల్లల బాగే వారు చూడరు, ఇంకా తీరిక చేసుకుని మన మంచి అడుగుతారా చెపుతారా.
తమ పేరెంట్స్, అలాగే పిల్లల క్షేమం సంస్కారం కోరే వారు, ఇతరుల క్షేమం కూడా కోరతారు, అడుగుతారు.
సాంబ్రాణీ/ మల్లెపూలు ఎక్కడైనా, సువాసనలు వెదజల్లుతుంది కదా? కొన్ని చోట్ల మాత్రమే నటించదు, అలాగే సద్గుణ వంతులు కూడా, తమ గుణాలను సంస్కారమును సంక్షేమం ను అందరి ఎడలా ఒకే విధం గా చూపుతారు.
Everyone is saying morals to us. Why should say that, and why should we listen? our money our wish, why need for those
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1978 General Articles and views 1,672,749; 102 తత్వాలు (Tatvaalu) and views 207,294 Dt : 14-Jun-2022, Upd Dt : 14-Jun-2022, Category : General
Views : 545
( + More Social Media views ), Id : 1429 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
everyone ,
parents ,
relatives ,
morals ,
listen ,
money ,
wish Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments