కన్నడ ఫలితాలు చూసారు కదా? కమలం అవినీతికి తగిన శాస్తి జరిగింది అని ఒప్పుకుంటారా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,350; 104 తత్వాలు (Tatvaalu) and views 225,588.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Have you seen Kannada results? Do you agree that Kamalam corruption has been punished?*

***
నేటి పరిస్తితులు, రాజకీయాలు, ఏవైనా సరే, పురాణాలతో ఉదాహరణలతో వివరం గా నిస్వార్ధం గా, పంచభూతాల శిక్షల నుంచి తప్పించుకోవడం కోసం మార్గం చెప్పే, ఒకే ఒక కధన విశిష్ట శైలి మనది. మీరు చదవడమే కాదు, మీ పిల్లలకు బంధువులకు స్నేహితులకు కూడా, చదివి చెప్పాలి, నేర్పాలి. ఊరంతా చెడుతో తగలపడితే, మన ఒక్క ఇల్లు ఆనందముగా సంస్కారముగా ఉండలేదు మిత్రమా. మనం మారాలి, మన చుట్టూ మారాలి. ఏళ్ళుగా, మా బాధ్యత రాయడం నిత్యం భుజం తట్టి మేల్కొలపడం దైవం వైపు మరల్చడం, మరి మీ బాధ్యత ఏమిటి దేవునికి అలాగే దేవుని సంతానానికి? అదే ఆ జవాబే, మీ వంశాన్ని కాపాడుతుంది లేదా పతనం చేస్తుంది.
***

అవినీతికి తప్పకుండా శిక్ష పడాలి, ఓడించాలి అది కమలమైనా, ఇంకోటి అయినా. మన మాట ఎవరు విన్నా వినకపోయినా, తప్పును ఎప్పుడూ సమర్ధన చెయ్యకూడదు.

ఇతరులు విననప్పుడు ఆ సంఘటనకు/ విషయానికి దూరముగా ఉండాలి లేదా తక్కువ తప్పును ఎంచుకోవాలి. కాకపోతే, కంట్లో నలక తీసామా, అసలు కన్ను నే తీసామా అనేది, మన తెలివి తక్కువ/ ఎక్కువ తనం పై ఆధారపడిఉంటుంది.

దుర్యోధనుడు, 5 ఊళ్ళు పాండవులకు ఇవ్వడం ఎందుకు అని, మొత్తం తన జాతి ప్రాణాలు తీసాడు - 11 అక్షౌహిణులు. దానిని మూర్ఖత్వం అంటారు.

100 మంది కౌరవులు, 5 గురు పాండవులకు ఎన్నికలు పెడితే, నేటి ప్రజాస్వామ్యములో ఎవరు గెలుస్తారు? అది మన పరిస్తితి, ముఖ్యముగా దక్షిణాన. 5 గురు మంచి వారికి, నీడ కూడా దొరకదు.

ఇలాంటి మూర్ఖపు రాజులు గతములో తన్నుకుంటూ, మధ్యవర్తి గా, వ్యాపారం కోసం వచ్చిన ఆంగ్లేయులను పెట్టుకుని, చివరికి వారికే దాసోహం అయ్యి, ముందు గొయ్యి వెనక నుయ్యి లాగా తయారు చేసారు ఆనాడు. ఇప్పుడు మనము అదే పంధాలో నడుస్తున్నాము, ఇంగిత జ్ఞానం ముందు చూపు వదలి.

కలియుగ ధర్మం ప్రకారం, 75 శాతం పాపం, 25 శాతం అంటే ఒంటి పాదం పుణ్యం - ఇప్పుడు 80 శాతం పాపం 20 శాతం పుణ్యం కూడా దాటి ఉంటాము. మరి మన దక్షిణాదిన, ఏది గెలుస్తుంది ఎక్కువ సార్లు? నష్టం ఎవరికి?

3 పంటల మాగాణి ని కాంక్రీట్ చేసి కాలరాస్తుంది ఎవరు? కరోనా కు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని హైదరాబాద్ పరుగులు ఎందుకు తీసారు? ఇప్పుడు అసలు రాజధాని ఏదో తెలీని దీనావస్తలో మనము ఎందుకు ఉన్నాము. అది మన తెలుగు వారి మూర్ఖత్వం కాదా? ఎందుకంటే, మన నక్క పులి పాము బుద్దులతో, మనల్ని మన జాతిని మనం కాటు వేసుకుంటున్నాము. ఈ రోజు ఇంకొకరు పతనం, రేపు మనము మన సంతానం పతనం. చేసిన పాపానికి, ఎవరమూ తప్పించుకోలేం. పంచభూతాలు కన్నేసే ఉన్నాయి.

మనకు 2 మాత్రమే పోటీలో ఉన్నారు అనుకుందాము, ఇందులో గజదొంగ 100 తప్పులు తో ఉన్నారు. బుల్లి దొంగ 20 తప్పులు తో ఉన్నారు. మనము ఓటు వెయ్యకుండా ఉండకూడదు, బుల్లి దొంగ కు వెయ్యాలి, లేదా ఓటు మురిగిపోతుంది, నోటా ఉంటే దానికి వేయవచ్చు. అప్పుడు అందరికీ ఆలోచన వస్తుంది.

ఏమిటి జనాలకు బుద్ది, సంస్కారం, లజ్జ, ఇంగిత జ్ఞానం వచ్చిందా? తమ సంతానం, తమ మనవళ్ళ, భావి తరాల క్షేమం కోరుతున్నారేమో? కొంపతీసి పురాణాలు, గీత, భారతం చదువుతున్నారా? ఆ శాఖాహారం తింటూ చాపపై నిద్ర పోయే, సజీవ గురువు సేవ చేసే వారి మాటలు చదువుతున్నారా? అని ఇంక నుంచి 10, 5 , 0 తప్పుల వారిని నిలబెడతారు. చిన్నగా సమాజం లో మార్పు, మంచి వైపు వస్తుంది.

అంటే చిన్నగా నక్క, పాము, పులిని వదలి, ఆవు వైపు వస్తాము. ప్రతి నియోజక వర్గములో, ప్రజలకు ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి.

కాని మనము ఎలా ఉన్నాము, ముగ్గురు దగ్గరా ముడుపులు తీసుకుని, అందరు దొంగలే కదా మన కుటుంబములో వ్యక్తులు లాగా అని, గజ దొంగ 100 తప్పుల కు వోటు వేస్తున్నాము. ఆ తర్వాత 150, 250, 750 తప్పులు, వెన్నుపోటు, ఫాక్షన్, వారసత్వ బానిసత్వం, అవసరం, అవకాశం, చివరకు మన బ్రతుకు బస్టాండింగ్.

చెయ్యి గుర్తు, ఎవరూ అందనంత ఎక్కువలో, నెలకో స్కాం ల లో మునిగి తేలుతుంది. మిగతా అందరూ ఆ చెయ్యి కన్నా, తక్కువనే అవినీతి స్కాం ల లో. కాబట్టి, కమలం 20 తప్పులు చేసింది అని, మొత్తము కమలాన్నే పక్కనపెడితే? మరలా 100 తప్పుల గజ దొంగకు ప్రాణం పోస్తామా?

ఆ గజదొంగ తో అవినీతి ఒక్కటే కాదు, సనాతన ధర్మం నీతి న్యాయం సాంప్రదాయం, అన్ని నాశనం అయ్యాయి. ఇంకా అవుతాయి. చరిత్ర చూడండి. అంతెందుకు ఆంధ్రాను విడతీసి నాశనం చేసి, తనకు తాను నాశనం అయ్యింది, చేయి కాదా, అధిష్టానం కాదా? భస్మాసుర హస్తం తన మీదే ప్రయోగించుకునే తెలివితేటలు, వారికే ఉన్నాయి. అవసరానికి రాజన్న, జగనన్న, చంద్రన్న, ఎవరితో నైనా రాజీ, పోటీ.

అంటే మన పెద్ద వాళ్ళ సామెత, కంటిలో నలక పడితే, నలక తీస్తామా? కన్ను పీకేస్తామా? అదే ఇప్పుడు జరిగింది, కన్ను పీకేసారు, కన్నడ ఓటర్లు. పెనం మీద నుంచి జారి, పొయ్యి లో పడ్డారు. మంట తక్కువ కదూ? రాబోయే రోజుల్లో చూద్దాము.

ఎవరో ఒకరు, రోజూ భాగస్వామి తాగి వచ్చి, తిడుతూ కొడుతూ ఉన్నారు అని, ఏదేదో చేద్దామని, కాపురం వదిలి, వీధులు ఊళ్ళు తిరిగి, ఇంకా మోసపోయి, అంత కన్నా దిగజారి, అసలు జీవితాన్నే పోగొట్టుకున్నారు. ఏ బాధ ఎక్కువ? ఇంట్లో భాగస్వామి బాధనా లేక నడిరోడ్డు మీద బతుకునా?

ఇప్పుడు జనాలతో ఓటు పని పూర్తి అయ్యింది. పెద్ద నాయకులు ఇద్దరు, మాకు అవకాశం ఇవ్వండి, మేము ఎక్కువ రాష్ట్రాన్ని నాశనం చేస్తాము, ముందు మేము అంటే మేము అని తన్నుకుంటున్నారు హస్తినాపురములో అప్పుడే. తమ బుద్దులు మారవు, పద్దతి పాడు ఉండదు, గౌరవం భక్తి పాపభీతి ఉండవు. వాళ్ళ ఇద్దరి క్షేమం చూస్తారా? ప్రజల క్షేమం చూడటానికి సమయం ఉందా, ఉంటుందా? ఎప్పుడు వెన్నుపోటో, కుర్చీ ఊడుద్దో వారికే తెలీదు. దిన దిన గండం, ప్రజలకు కమ్మని మత్తు.

జనము బఠానీళ్ళు తింటూ, ఓటీటీ సినిమాలు చూసుకుంటున్నారు, వచ్చే 5 ఏళ్ళు దాకా, లేదా వీరు వీరు తన్నుకుని, ప్రభుత్వం కూలిందాకా. ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు? ఎవరి రాత వారే రాసుకుంటున్నాము మిత్రమా. నిద్రలే, పంచభూతాలతో నలిగిపోయే నాశనం మనకు వద్దు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,350; 104 తత్వాలు (Tatvaalu) and views 225,588
Dt : 17-May-2023, Upd Dt : 17-May-2023, Category : Politics
Views : 253 ( + More Social Media views ), Id : 1750 , Country : India
Tags : kannada , congress , bjp , sivakumar , siddaramayya , results , agree , kamalam , corruption , punished
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content