కేంద్రం పై పట్టు - ఎన్టీఆర్ పరాక్రమం కు చంద్రన్న చాటుతనం, రాజన్న రాజసానికి జగనన్న బేలతనం - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,658; 104 తత్వాలు (Tatvaalu) and views 225,613.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* ఆడలేక మద్దెల ఓడు
* ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పాల కేంద్రం
* రోజమ్మ, వైసీపీ లో సొంత వాళ్ళే
* చంద్రన్న ప్రచారం కు వెళ్లిన ఊర్లలో
* పవన్ వీరన్న ప్రశ్నించాలి అని అడుగుతామా
* వీర కొదమ సింహాలను కదా, అడగాల్సింది
* దళితులు ను సీఎంగా చేసి కాపలా కుక్క లా
* తెలుగు హీరోల మీద
2 min read time.

ఎవరో తెలివిగా చెప్పిన, ఆడలేక మద్దెల ఓడు అన్న సామెత, తెలుగు వారమైన మనకు, ప్రతి విషయం లో సరిపోతుంది. అది ప్రత్యేక హోదా అయినా, విశాఖ ఉక్కు అయినా, ఇంకోటి అయినా ఒకటే. ప్రభుత్వ పాల కేంద్రం ను చంపి, అప్పుడు హెరిటేజ్ ఇప్పుడు అమూల్ ప్రవేటు పాలు అయినా, నోరు ఎత్తం, ఎందుకు ప్రవేట్ పరం అని, కదూ? కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడే, నాయకుని సమర్ధత బయటపడేది.

ఎమ్మెల్యే రోజమ్మ ఈరోజు, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ లో సొంత వాళ్ళే, ఏదో కొత్తగా వెన్నుపోటు పొడుస్తున్నారు, అని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఆర్టికల్ కూడా రాశాం, వైసీపీ ని పాడు చేస్తోంది, వైసీపీ వారేనని, అధికార మత్తులో.

త్వరలో ఎన్నికల్లో ఫలితాలు చూద్దాం, మన తెలుగు వారి బుద్ధి మారిందేమో కొంచెమైనా, నీతి నిజాయితీ వైపు.

ఇప్పుడు చీరాల లో మరియు మిగతా చోట్లా తెదేపా ను, గతంలో తెదేపాలో ఎన్టీఆర్ ను, అలాగే కాంగ్రెస్ ను, సొంత వారే, అలా ద్రోహం చేశారు, చేస్తున్నారు, ఇంకా చేస్తారు.

నీతి నిజాయితీ అభివృద్ధి అవసరం లేదు, ఆర్భాటాలు అబద్ధాలు చాలు, లింక్ లో గత కధనం చూడండి. link. అది మన తెలుగు జాతి హక్కు, ఎవరూ దానిని వదులుకోము. ఎమ్మెల్యే ఎంపీ గా, కేసులు ఆరోపణలు వెన్నపోటు లు లేదా, కోటి పైన ఆస్తి ఉంటేనే, మన ఓటు వేస్తాం లేదంటే ఆ అభ్యర్ది ని పట్టించుకోము కదా.

ఉన్న ఊర్లో, మన బజార్లో ప్రభుత్వ భూమి కబ్జా చేసి, షాపు పెట్టి పదేళ్ళు గా నడుపుతున్నా, ఎవరం తప్పు అనం, గ్రామ పట్టణ ద్రోహ నిర్లక్ష్య బుద్ధి తో. పంచాయితీకి మున్సిపాలిటీ కి కాగితం పెట్టం, వారి మీద.

అది తెలిసి కూడా, సిగ్గు లేని మన తెలుగు వారిని, ప్రాంతాల వారీగా విడదీస్తూ నిలదీస్తూ ఉన్నారు చంద్రన్న ప్రచారం కు వెళ్లిన ఊర్లలో, గుంటూరు వారికి సిగ్గు లేదా, వైజాగ్ వారికి రోషం లేదా, కుప్పం వారికి పౌరుషం లేదా అని అంటున్నారు.

నాటి చీరాల ఒంగోలు అద్దంకి తాలూకా లు కూడా, ఒకనాటి మహా గుంటూరు జిల్లా లో భాగాలే, విడదీసి ప్రకాశం చేశారు అంటున్నారు, మేమూ గుంటూరు మిరప కారం వాళ్ళమే.

కాబట్టి, తెలుగు జాతికే సిగ్గు లేదంటే సరిపోతుంది, ఆయన అర్థం కూడా అదే. తప్పు లేదు, అలాగే కడగాలి మమ్మల్ని, చచ్చిన రోషం పెరిగిన దాకా. అలాగే జనమూ నాయకులు ను కడగాలి, నటన తో ముసుగులో గుద్దులాటలు లేకుండా.

లేకపోతే విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా గురించి, ఒక్క ఎమ్మెల్యే సీటు లేని, పవన్ వీరన్న కేంద్రం ని ప్రశ్నించాలి అని అడుగుతామా, మనము సిగ్గు ఉంటే, అంటే మిగతా నాయకులు వేస్ట్ అనేగా, మన ఉద్దేశ్యం? మనకు నమ్మకం లేకనే కదా, వారిని ఓడించింది, వీరిని 10 ఏళ్ళు గా గెలిపించింది? కాబట్టి, అడగాల్సింది ఎవరిని? మనం నమ్మకం తో గెలిపించి న, మన వీర కొదమ సింహాలను కదా, అడగాల్సింది అని విజ్ఞులైన ఓటర్లు భావన.

ఇంకొంతమంది తెలుగు హీరోల మీద పడతారు, అడగరేమని దేని గురించి. వారు ఎందుకు పలకాలి, మనకు తెలీదా బయట వారు జీరోలు అని. పాపం హీరోయిన్ లను కూడా అడుగుతారేమో. మనము బాధ్యత గా, మంచి వారికి ఎందుకు ఓటు వేయము. మనము మాత్రము మారము.

ఎప్పుడూ నేను కేంద్రం లో చక్రం తిప్పా అనే, 40 ఏళ్ల అనుభవం ఉంది అనే, పదేళ్ల కు ముందే హైదరాబాద్ రాజధాని ని వదలి అమరావతి వచ్చి అందర్ని రప్పించి, ఓడిపోయాక అందరిని వదిలి హైదరాబాద్ లో నే ఉండే,

3 పంటల పొలాల్లో కాంక్రీటు భవన రాజధాని, ఆత్మాభిమానం తో సింగపూర్ కు భూమి ఇచ్చి వారి తో నే కట్టించే, మొనగాడు, మన చంద్రన్న,

గెలిచిన కొద్ది ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు తో, ఢిల్లీలో ఆంధ్రా భవన్ లో కాకుండా, పబ్లిక్ రోడ్ మీద భీకర ధర్నా లు చేసి, పంజాబ్ రైతులు చేసిన విధముగా, కేంద్రం ను గడగడ లాడించరే, అని మన తెదేపా ఎన్టీఆర్ అభిమానులు ఆశ్చర్య పోతున్నారు.

కేంద్రంతో ఎన్టీఆర్ పరాక్రమం కు, చంద్రన్న చాటుతనం కు అసలు పోలికలు లేవు అని బాధపడుతున్నారు.

అలాగే గతంలో కాంగ్రెస్ సోనియమ్మ ను గడగడ లాడించారు అంటున్న, మన పులి బిడ్డ జగనన్న, 25 ఎంపీలు ను ఇవ్వండి కేంద్రం మెడలు వంచుతా, అని శపధం చేసిన మన కడప యువ కిశోరం,

మడమతిప్పను అని ఎమ్మెల్సీ పెద్దల సభ వేస్ట్ అని రద్దు చేసి, మరలా 6 గురు పెద్దల ని గెలిపించి న మన అన్న ,

రెండు ఏళ్ల లోనే నభూతో నభవిష్యత్తు అన్నట్టు గా, పధకాలకు ఇద్దరు పేర్లు పెడుతూ, అప్పులో ప్రధమ స్ధానం తెచ్చిన మన ముందు చూపు తెలివైన జగనన్న,

బేలగా ఊరక ఉత్తరాలు రాస్తూ, అధికారంలో ఉండి ఆంధ్రా లో ధర్నాలు అరుపులు తో కాలయాపన మాని, ఢిల్లీలో లో ఎందుకు 151 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు తో పెరేడ్ నిర్వహించి, జగనన్న సత్తాను మోదీ ముందు నిరూపించి,

విశాఖ ఉక్కు ను, ప్రత్యేక హోదాను, ఎందుకు తీసుకుని రాలేరు,

రాజన్న బిడ్డ మోదీని ఎదిరించి నిలబడ్డారు అన్న ఖ్యాతి ఎందుకు వదులు కుంటున్నారు, అని వైసీపీ రాజన్న శ్రేణులు తెల్లబోతున్నారు, ఎలా జగనన్న వీరత్వంను, సలహాదారుల పనితనం ను పొగడాలో భవిష్యత్తు లో తెలీక.

రాజన్న ఉండి ఉంటే, అధికారంలో ఉండి కూడా, ఈ నిస్సహాయత పరిస్థితి, కేంద్రం తో ఉండేదా అని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం మీకు చెప్పి చేశాము సంవత్సరం గా అంటే, అప్పటినుంచి గమ్ముగా దాచి, ఇప్పుడు నోరెత్తలేని విచిత్ర స్ధితి.

రాజన్న కు జగనన్న కు పోలికలు లేవు ధైర్యం లో, కార్యకర్తల ను మీడియా ను కలవడం లో, గెలిచాక అంటున్నారు.

తెలంగాణా లో తెలుగు సోదరులుది అదే పరిస్థితి, దళితులు ను సీఎంగా చేసి కాపలా కుక్క లా కూర్చుంటాను అన్నా, జనానికి ఒక ఉద్యోగం లేకపోయినా మా కుటుంబం లో 4 పదవులు, గెలవకపోతే ఎమ్మెల్సీ గా నైనా నిలబెట్టినా, ధనిక రాష్ట్రం ను అప్పులు లో ప్రథమం గా నిలిపినా, అక్కడ కూడా నోరు ఎత్తము.

అందుకే తప్పు, నాయకులు ది కాదు, నీతి నిజాయితీ బాధ్యత తో ఓటు వేయని, మన తెలుగు ఓటరు ది, స్వార్ధం తప్ప ఇంకేది మనకు అవసరము లేదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,658; 104 తత్వాలు (Tatvaalu) and views 225,613
Dt : 10-Mar-2021, Upd Dt : 10-Mar-2021, Category : Politics
Views : 733 ( + More Social Media views ), Id : 1020 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : hold on center , ntr , prowess , brave , chandranna , rajanna , rajasam , control , jagannanna , andhra , silly , politics
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content