తెలుగు జాతి వెలుగు - ఎన్టీఆర్ రాజన్న టైంలో - పోలింగ్ సరళి, డౌన్ తెలుగు ఓటరన్న - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,153; 104 తత్వాలు (Tatvaalu) and views 225,028.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* అన్నం మెతుకు ఒకటి చాలు
* కుట్ర మోసం తో సొంత పార్టీ నే, సొంత నాయకులు
* ఎన్నికల్లో 75.95 శాతం, వాలంటీర్లు కౌన్సిలింగ్
* ఓటు వేయించ లేకపోవడం, అధికారుల నాయకుల నిర్లక్ష్యం
* పార్టీ ని భూస్థాపితం చేసింది, తెదేపా అధిష్ఠానమే
* వైసీపీ పతనం చేతులారా, వైకాపా అధిష్ఠానమే
* బీజేపీ జనసేన అధిష్ఠానమే పార్టీ ని ఎదగనీయకుండా
2 min read time.

మీరు దేశంలో రాష్ట్రంలో, ఇతర ప్రాంత నాయకులు మరియు ప్రజలు అయినా, చీరాల ఒంగోలు లేదా ప్రకాశం విషయాలు పంపే కారణం, అన్నం మెతుకు ఒకటి చాలు, అన్నం మొత్తం పట్టుకుని ప్రతి మెతుకు అన్నం మొత్తాన్ని దేవి చూడక్కరలేదు, అలాగే రాష్ట్రం మొత్తం రాజకీయం, అని పెద్దలు అంటారు.

కుట్ర మోసం తో సొంత పార్టీ నే, సొంత నాయకులు, సొంత అధిష్ఠానం నాశనం చేయడం, అలాగే వర్గ కుల ధన మజ్జిగ అవసర అవకాశ మత్తులో బాధ్యత లేకుండా అమ్ముడుబోయి మనం ఓటు వేయడం, ఏ ఊరైనా ఒకటే, నేటి అబద్ధాల భ్రమల రాక్షస రాజకీయం, ఏ ప్రాంతమైన ఒకటే, మన తెలుగు జాతికి, అంటారు విజ్ఞులు పెద్దలు, మీకూ తెలుసు కాబట్టి. link.

చీరాల మున్సిపల్ ఎన్నికల్లో 75.95 శాతం ఓట్లు పోలైనట్లు తెలిసింది షుమారు గా. మొత్తం ఓట్లు 61195 కాగా 46478 ఓట్లు పోలయ్యాయని షుమారు అంటున్నారు. వీలైతే, ఇందులో సరిగ్గా ఓటు వేయని మురిగిపోయిన వోటు వారిని కూడా పట్టుకుని, వాలంటీర్లు కౌన్సిలింగ్ ఇవ్వాలి.

అంటే షుమారు 15 వేల ఓటర్లు, మాయమైనారు లేదా నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా ఇంట్లో నే ఉన్నారు లేదా తప్పుడు ఓట్లు కావొచ్చు. వారికి ఎందుకు రేషన్ కార్డు, ప్రభుత్వ పధకాలు ఇవ్వడం, అని వారిని ప్రశ్నించాలి. మన రాష్ట్రానికి, మన జగనన్న, చంద్రన్న, పవనన్న, అక్కడ కేసీఆర్ అన్న బండి అన్న కు, ఎందుకు ద్రోహం చేస్తున్నారు ఓటు వేయకుండా అని బుజ్జగించాలి.

వారిని గుర్తు పెట్టుకుని, తర్వాత ఎలక్షన్ లో, ముందే నిద్ర లేపాలి, బూత్ కు వచ్చే ఏర్పాట్లు చేయాలి. వాలంటీర్ లు అలాగే అన్ని పార్టీలు, అసలు ఓటు వేయని వారిని గుర్తించి, కౌన్సిలింగ్ ఇవ్వాలి అని పెద్దలు అంటున్నారు.

మరి వైకాపా తెదేపా నాయకులు, ఆ 15 వేలమంది వేరే దేశంలో లేదా రాష్ట్రంలో ఉన్నారా? దూరం ధనం ఇబ్బందులు తో రాలేదా? వేరే చోట ఉంటే, ఓటు తీసేస్తున్నారు కదా.

దేశంలో రాష్ట్రం లో నే ఉంటే, ఊళ్లో నే ఉంటే, ఎందుకు రాలేదు? వారు చదువుకున్న మూర్ఖలా లేక చదువు లేని వారా? పధకాలు పొందారా, పొందుతున్నారా లేదా?

ఎందుకు ఉత్తేజ పరచడం లో విఫలం అయ్యాం అని, అన్ని పార్టీలు ఆత్మ విమర్శలు చేసుకుని, వారి వివరాలు అధిష్టానం కు ఇచ్చి, బహిరంగంగా బాధ్యత గా తెలియచేయాలి.

ఎందుకంటే 90 శాతం ఓటు వేయించ లేకపోవడం, ప్రభుత్వ అధికారుల అలాగే పార్టీ నాయకుల నిర్లక్ష్యం. ఊళ్ళో ఉన్నవారు, ఇతర రాష్ట్రాలు దేశాల్లో ఉన్న వారు, చదువు ఉన్న వారు లేని వారు, ప్రభుత్వ పధకం పొందుతున్న వారు పొందని వారు, అని కాటగిరీలు గా వివరాలు బహిరంగంగా చెప్పాలి, అన్ని జిల్లా పట్టణ గ్రామ ప్రాంతాల్లో సమాచారం సేకరించి.

చీరాలలో ఒక ముదుసలి కార్యకర్తను అయినా, వార్డులలో నిలపకుండా జెండా పట్టుకుని తిరగకుండా, పరిస్థితి తెలీసీ 2 ఏళ్లుగా నిర్లక్ష్యం చేసింది, మన వర్గ వ్యక్తి కోసం, పార్టీ ని భూస్థాపితం చేసింది, చేతగాని తెదేపా అధిష్ఠానమే. చీరాల తెదేపా ఫేస్బుక్ చూడండి, స్ధానిక విషయాల మీద ఒక్క పోస్ట్ లేని దౌర్భాగ్యం, తెదేపా కున్న ఇంత అనుభవం తో. లోకేష్ దృష్టి పెట్టాలి అని, అభిమానులు కోరిక.

చీరాలలో 2 వర్గాల ను ఉసికొల్పుతూ, అసలు గెలుపు ముందు కార్యకర్తలు ను వదిలి రెబల్స్ కు అవకాశం ఇచ్చి, చలిమంటలు లో ఆజ్యం పోస్తూ, కొరివితో తలగోక్కుంటూ, వైసీపీ పతనం చేతులారా, అధికార మత్తులో చేస్తోంది, అహంకారంతో వైకాపా అధిష్ఠానమే. జగనన్న దృష్టి పెట్టాలని, అభిమానులు కోరిక.

చీరాలలో బీజేపీ జనసేన, నోరు ఎత్తలేని పెగలని అమాయకపు నాయకులు తో, నిద్ర మత్తు ఆవులింతల వారితో, మమ అని పార్టీ నడిపిస్తూ, కనీసం ఫేస్బుక్ లో స్ధానిక నాయకులు ఫోటోలు పనులు సమస్యలు ధర్నాలు, రెండు ఏళ్లుగా పెట్టుకోలేని చేతగాని దుస్థితి లో ఉంచి, బీజేపీ మరియు జనసేన అధిష్ఠానమే పార్టీ ని ఎదగనీయకుండా, సర్వనాశనం చేస్తోంది.

మన తెలుగు జాతి ఉత్తమ లక్షణం, మనల్ని ఎవరూ నాశనం చేయలేరు, ఆ అవకాశం ఇవ్వము. ఎందుకంటే మనల్ని మనమే మమ్మల్ని మేమే నాశనం చేసుకుంటాం, అనే గొప్ప మనస్తత్వం మనది. అది కుటుంబం అయినా, బజార్ అయినా, గ్రామ పట్టణం జిల్లా అయినా, పార్టీ అయినా, సంస్థ అయినా, మేము మారం.

తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది, అనేది పాత మాట, ఎన్టీఆర్ మరియు రాజన్న టైంలో, కేంద్రమును అడగడములో. ఇప్పుడు అది లేదు, ఆ ఆశా లేదు, ఆ ధీరత్వం పోరాట పటుత్వము దైర్యం చాణక్యము లేవు. ఆఖరికి కేసీయార్ కూడా, పులి లా అరుస్తూ ఇక్కడ, డిల్లీ వెళ్ళిన తర్వాత పిల్లి లా వస్తున్నారు. మరలా హైద్రాబాద్ లో పులి గా గాండ్రింపులు.

అందుకే జై జగనన్న, జై చంద్రన్న, జై కేసీఆర్ అన్న, డౌన్ డౌన్ తెలుగు ఓటరన్న అంటున్నారు విజ్ఞులు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,153; 104 తత్వాలు (Tatvaalu) and views 225,028
Dt : 10-Mar-2021, Upd Dt : 10-Mar-2021, Category : Politics
Views : 726 ( + More Social Media views ), Id : 1021 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : telugu jati , nindu velugu , ntr , rajanna , time , poling Pattern , percent , chirala , satam , down , telugu , voter
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content