మూడు రాజధానులు - నాయకుల వర్గీయుల అవసరాల విన్యాసాలు - జనము అయోమయం - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1728 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1763 General Articles and views 1,274,259; 90 తత్వాలు (Tatvaalu) and views 175,275.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఒక గురువు గారు అడిగారు మూడు రాజధానుల గురించి. ఇలాంటి వాటికి దూరముగా ఉండాలి, ఎందుకంటే, మనకు బుద్ది ఉంటే, కూతురు లాంటి ఓటును చెడ్డ వారికి ఇవ్వము (వేయము), లేదా ఓటుకు దూరముగా ఉండము, గతము లో అయినా ఇప్పుడు అయినా. ఇది కేవలం ఇరు వర్గాలలో ఉన్న పెద్దల ఆట, అవునంటే వారికి కోపం కాదంటే వీరికి కోపం.

ఆ వర్గాలలో కూడా, మామూలు జనానికి సంబంధం లేదు, అప్పుడు ఇప్పుడు కూడా. కేవలము రాజకీయవాదులు, అవసర వాదులు, కుల వర్గ వాదులు ఇరువైపులా ఆరోపణలు ప్రత్యారోపణలు.

ముందు ఒక పిట్ట కధ చూద్దాం, సామాన్యుడికి అర్ధము అవటానికి. రామయ్య కొడుకు నలుపు ఉద్యోగం లేదు. ఉద్యోగం ఉంది అని అబద్ధం చెప్పారు. సీతయ్య కూతురు బరువు, అంత ఆనదు. కానీ కోట్లు ఉన్నాయి అని అబద్ధం చెప్పారు. అబద్ధాలు బయటపడనంత వరకు, అబ్బాయి రాముడు ఉత్తముడు, అమ్మాయి సీత రూపవతి అని పొగిడారు.

అసలు రంగు బయట పడ్డాక లేదా గొడవలు మొదలై విడాకులకు పోయేటప్పుడు, ఆ వర్గము అబ్బాయి ని దొంగ అని, ఈ వర్గము అమ్మాయి ని బండ అన్నారు దుమ్మెత్తిపోస్తున్నారు పేపర్లు టీవీలలో. ఆ గోల విన్న బంధువులు అప్పుడు ఇప్పుడు ముక్కున వేలేసుకున్నారు, చెవులు కొరుక్కున్నారు, తమకు పని ఉన్న వాళ్ళ పక్షాన చేరి అరుస్తున్నారు గోల గోల చేస్తున్నారు.

అందరూ కూడా ఎదుటివారు దొంగలు మేము దొరలము, న్యాయము చేయడానికే ప్రయత్నిస్తున్నాము అని అంటారు కదా.

బయట జనం నవ్వు కున్నారు, ఇంకా ఆ తగువులు మా ఇంట్లో రాలెదు గదా అని పిచ్చి వాళ్ళు లాగా, ఎందుకంటే ఈ అబద్దాలు అన్ని ఇళ్ళలో ఉన్నవే గదా, వస్తాయి చిన్నగా.

ఇప్పుడు చెప్పండి తప్పు మోసము అమ్మాయి దా, అబ్బాయి దా? అటు ఇటు మాటలు అబద్దాలు మోసిన బంధువులు దా? అబద్ధాలు అని తెలిసీ గమ్ముగా ఉన్న చుట్టుపక్కల బయట జనం దా? అసలు అబద్ధాలు కు, తమ అవసరాల కోసం, ఆజ్యం పోసి నిప్పు అంటించిన రామయ్య సీతయ్య దా?

ఒక సంవత్సరము అరుచుకున్నా, తన్నుకున్నా దీనికి జవాబు దొరకదు. ఎవరూ తప్పు ఒప్పుకోరు, అవతల వ్యక్తినే తప్పు పడతారు.

దేశ రాజధాని ఢీల్లీ ఎక్కడ ఉంది? ప్రధాని, సుప్రీం, పార్లమెంట్ ఎక్కడ ఉన్నారు ఉన్నాయి. దేశము మధ్యలో ఉందా? ఎంత మంది జనం కు వాటితో పని? 75 శాతం కు వాటి దగ్గరకు పోరు. మనకు మూడు అంతల పెద్దది అమెరికాకు రాజధాని వాషింగ్టన్ డీసీ, తూర్పు దిక్కున ఉంటుంది. మన కన్నా 3 రెట్ల దూరము.

కృష్ణా జిల్లా రాజధాని మచిలీపట్నం అని, ఎంత మూల ఉందో, ఎంత మందికి తెలుసు? అందరూ రైలు రోడ్ విమానం ఉన్న విజయవాడ అనుకుంటారు. కానీ కాదు.

అమరావతి పచ్చని పంటలు ఎందుకు ఎండబెట్టి కట్టాలి? ఎందుకు బలవంతము గా లాక్కోవాలి? ఎందుకు ఆశలు కలిగించాలి? 5 ఏళ్ళు ఎందుకు పూర్తిగా భవనాలు కట్టలేదు? ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది, అంతా మీ వర్గం కు అనుకూలముగా అని వీరంటారు, ఇదుగో 4000 ఎకరాలకు సాక్ష్యం అంటారు. వైజాగ్ లో మీరు అదే పని చేస్తున్నారు ఇదిగో సాక్షము అని వారంటారు.

హైకోర్టు అన్నా వచ్చింది లే అని కొందరికి అదో స్వల్ప పిచ్చి తృప్తి. అదీ మాకెందుకు ఉపయోగము లేదు, జిరాక్స్ సెంటర్ కా అని ఇంకొకరు.

వైజాగ్ రాజధాని అని ఒకరు ఆనందం, వామ్మో మా భూముల కబ్జా అని ఇంకొకరి బాధ. 3 రాజధానులేమిటి 4 నుంచి 30 రాజధానులు అయినా పెడతాము అని ఇంకొకరు.

రైతులకు అన్యాయము చేసి మారుస్తున్నారు అని వీరు అంటారు. 5 ఏళ్ళుగా మీరెందుకు పూర్తి చేయకుండా, రైతుల భుములు లాక్కుని, వాళ్ళని ఎందుకు ముంచారు అని వారంటారు.

అమరావతి రేట్లు పడతాయి అని ఒకరి బాధ, పడితేనే మనలాంటి వారము కొనుక్కోగలము అని ఇంకొకరి ఆశ.

అభివ్రుద్ది వికేంద్రీకరణ కావాలి కానీ, రాజధానులు కాదు అని ఒకరు. మాకు తెలుసులే అని ఇంకొకరు.

మా రాయలసీమ మాకు కావాలి, మా ఉత్తరాంధ్ర మాకు కావాలి, మా కోస్తా మాకు కావాలి అంటారు. మాకే రాజధాని కావాలి అంటారు. తెలంగాణా ఒక ముక్క పోయింది, ఇంకా ఎన్ని ముక్కలు కావాలో. మా కులపోడే నాయకుడు అవ్వాలి అని వారూ వీరూ. అయినా ఎవరము మన స్వార్ధము వీడము.

నలుగురు పక్క కులాలు వర్గాల వారికి నాలుగు స్థలాలో లేదా ఉద్యోగాలో లేదా బిస్కెట్ లో పడేసి, ఇది గో మా వర్గమే కాదు, మిగతా కులాల వారూ ఉన్నారు బాధితులలో అని చూపించడము, వారూ వీరు కూడా.

మీ వర్గానికి లాభం చేయడానికి, ముందే వైజాగ్ లో కొన్నారు కాబట్టి, మారుస్తున్నారు అని వీరంటారు, మీరు అధికారము లో ఉన్నప్పుడు చేసింది అదే గదా అని వారంటారు.

ఎలక్షన్ వస్తే ఓటు కి ఎంత ఇస్తారు అనేది తప్ప మిగతావి మాకొద్దు గాక వద్దు అంటారు ఇంకొకరు.

మా కులపోడు ఏది చేసినా కరెక్టే అంటారు ఇంకొకరు. నాకు ఉద్యోగము ఇచ్చారు అంతా ఒకే అంటారు ఇంకొకరు.

అసలు మేము ఓటే వేయము గాక వేయము, మీరేదైనా అమ్ముకోండి కొనుక్కోండి అంటారు ఇంకో బాధ్యత లేని పిచ్చి మనిషి.

అంటే అందరమూ అవకాశ వాదులమే. రాష్ట్రం కోసం, దేశం కోసం‌, ఊరు కోసం మంచి ఆలోచన చేసేవారు ఎవరూ లేరు, ఒక్కరూ లేరు.

అమెరికా లో ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం మొదలు పెట్టకుండా అధికారం కత్తిరించడానికి ప్రతిపక్షం ప్రయత్నం చేస్తుంది. జన చైతన్యం అలా ఉండాలి. మరి మన దగ్గర, కేవలం అవసరం, వర్గ చైతన్యం మాత్రమే.

అప్పుడు వాళ్ళు ధర్నాలు, ఇప్పుడు వీళ్ళ ధర్నాలు. అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు అంతే.

కొంతమంది రాజకీయ నాయకుల వే తప్పులు అంటున్నారు. శాస్త్రం దానిని ఒప్పుకోదు, ఎందుకంటే నాయకులు ఎవరు? ఆకాశము నుంచి ఊడి పడ్డారా? లేదే, మన జనం లో ఒకరు. వారిని అక్కడ కూర్చోబెట్టింది ఎవరు, ఓటు వేసి? మనం.

అంటే అర్థం ఏమిటి, పాత లేదా కొత్త నాయకులు ఇద్దరు ది తప్పు లేదు. జనం తప్పుడు భావాలను తమకు అనుకూలముగా అమలు చేస్తున్నారు.

మొదట చేసిన ఎన్నికల ఖర్చు వెనక్కి తెస్తున్నారు, తమకు డబ్బు సహాయం చేసిన వారికి లాభము చేకూర్చుతున్నారు.

30 శాతం ఓటు వేయని మనం తప్పుడు వాళ్లం, మన పిల్లలు నగరము నుంచి వచ్చి ఓటు వేసారా? ఊళ్ళొ ఉన్నవారు ఓటేసారా?

70 శాతం డబ్బు, కులం, వర్గం, ప్రాంతం, అవసరం కు అమ్ముడుపోయిన మనమే, తప్పుడు వాళ్లం. మనం మారకుండా మన నాయకులు ఎందుకు మారాలి?

అదే కలికాలం , ఫలితాలు కష్టాలు కన్నీళ్లు అనుభవించేదీ మనమే, పాపం చేసిన వారూ చేయని వారు కూడా. దేవుడా మా బుద్ధులు ఇల్లు కుటుంబము మార్చుకోకుండా, అవకాశం అవసరం వర్గం కోసం, అన్యాయం జరుగుతుందని అరచే సన్నాసులం ఎప్పుడు మారతామో.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1763 General Articles and views 1,274,259; 90 తత్వాలు (Tatvaalu) and views 175,275
Dt : 10-Jan-2020, Upd Dt : 10-Jan-2020, Category : Politics
Views : 932 ( + More Social Media views ), Id : 278 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra 3 capitals
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content