1.
భారీగా బంగారం కొంటున్న చైనా.. డ్రాగన్ ప్లాన్ ఏంటి..? - 2024-05-06T11:55:07+05:30
Gold Reserves: మన పొరుగు దేశం చైనా బంగారం భారీగా కొనుగోలు చేస్తోంది. ఆ దేశ కేంద్ర బ్యాంక్ గోల్డ్ నిల్వలను భారీగా పెంచుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరల పెరుగుదలకు ఇది ఒక కారణమవుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, రేపు అనేది లేదు అన్న విధంగా చైనా బంగారం ఎందుకు కొనుగోలు చేస్తోంది. డ్రాగన్ ప్లాన్ ఏంటి?
ఇంకా
2.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ నిరాకరణ... కీలక నిర్ణయం దిశగా అడుగులు - 2024-05-06T12:26:27+05:30
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ.. జడ్జి కావేరి భవేజా తీర్పును వెలువరించారు. దీంతో ఆమె కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ట్రయల్ కోర్టు తీర్పుపై ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ఇంకా
3.
ఆధారాలు బయటపెట్టాలి.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: వైఎస్ షర్మిల సవాల్ - 2024-05-06T12:33:24+05:30
Ys Sharmila Challenge To Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తాను రూ.వెయ్యి కోట్ల వర్క్ కావాలని తాను అడిగినట్లు నిరూపిస్తే రాజకీయాలు మానేసి వెళ్లిపోతానని సవాల్ చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దమ్ముంటే ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో గతంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్.. ఆ తర్వాత పిటిషన్ ఎందుకు వెనక్కు తీసుకున్నారో చెప్పాలన్నారు.
ఇంకా
4.
Ap Elections Live Updates: నేడు ఏపీకి ప్రధాని మోదీ.. రెండు కీలక సభలు - 2024-05-06T05:26:28+05:30
AP Assembly Election 2024 News Live Updates: ఏపీ ఎన్నికల్లో ప్రచారానికి చివరి అంకానికి చేరుకుంది. ఈ శనివారంతో ప్రచారం ముగుస్తోంది. దీంతో పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచారు.. ఓవైపు ప్రధాన పార్టీల అధినేత, అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ కూటమి తరఫున ప్రచారానికి వస్తున్నారు.. రెండు సభల్లో పాల్గొంటారు. ఏపీ ఎన్నికల తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి.. లైవ్ అప్డేట్స్ ఇలా..
ఇంకా
7.
నేనూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం బాధితుడినే.. వివరాలతో ఆంధ్రప్రదేశ్ మాజీ ఐఏఎస్ ట్వీట్ - 2024-05-06T11:06:48+05:30
Pv Ramesh On Land Titling Act: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ట్వీట్ చేశారు. #LandTitlingAct హ్యాష్ ట్యాగ్తో ఆయన పోస్ట్ చేశారు. తాను ప్రత్యక్ష బాధితుడినని చెప్పుకొచ్చారు. 36 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా ఏపీకి సేవలందించిన తన పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం అంటూ పీవీ రమేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
ఇంకా
8.
అమానుషం.. భర్తతో గొడవపడి మూగ బిడ్డను మొసళ్లున్న నదిలోకి విసిరేసింది - 2024-05-06T11:17:30+05:30
పుట్టు మూగవాడైన కుమారుడి విషయంలో భారాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మాటలురాని ఇలాంటి బిడ్డను ఎందుకు కన్నావంటూ భార్యను భర్త ఆడిపోసుకుని.. సూటిపోటి మాటలతో వేధించేవాడు. ఈ బిడ్డను ఎక్కడైన విసిరేయమని కర్కోటకుడిలా మాట్లాడటం.. పదే పదే వేధించడంతో ఆ తల్లి ఊహించని నిర్ణయం తీసుకుంది. తన బిడ్డను మొసళ్లకు ఆహారంగా పడేసింది. గుండెల్ని మెలిపెట్టే ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
ఇంకా