1.
తిరుపతి జిల్లాకు తీపికబురు.. ఇండస్ట్రియల్ హబ్గా ఆ ప్రాంతం.. నారా లోకేష్ ట్వీట్ - 2026-03-09T16:49:37+05:30
తిరుపతి జిల్లాలోని నాయుడుపేట ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకుంటోందంటూ మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ హౌసింగ్ ప్రాజెక్టు ప్రారంభించిన నేపథ్యంలో నారా లోకేష్ ఈ ట్వీట్ చేశారు. నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థతో పాటుగా పలు సంస్థలు ముందుకు వచ్చాయంటూ నారా లోకేష్ వాటి వివరాలను పంచుకున్నారు. పోర్టుకు సమీపంలో ఉండటం నాయుడుపేటకు కలిసివస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇంకా
2.
మీ ఆదాయంపై భారీగా పన్ను ఆదా చేసుకోవాలా? మార్చి 31 లాస్ట్ డేట్.. 5 ఆప్షన్లు ఇదిగో! - 2026-03-09T16:28:22+05:30
Tax Saving Investments: ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు సమయం దగ్గర పడుతోంది. మార్చి 31తో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఇక ఈ క్రమంలోనే పాత పన్ను విధానంలో పన్ను ఆదా చేసుకునేందుకు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. మార్చి నెలాఖరులోపు వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తేనే ఆ పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. వీటిల్లో పీపీఎఫ్ సహా టాక్స్ సేవర్ ఎఫ్డీ, ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఉన్నాయి. వీటి గురించి చూద్దాం.
ఇంకా
3.
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నటుడు.. - 2026-03-09T16:44:42+05:30
విజయ్ - త్రిష సంబంధంపై రూమర్స్ వైరల్ అవుతున్న వేళ, ఇటీవల త్రిషను ఉద్దేశించి నటుడు పార్ధిబన్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. త్రిష ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కామెడీ అవ్వదని, అది కేవలం మూర్ఖత్వమే అని ట్వీట్ చేశారు. అయితే తన వ్యాఖ్యలకు పార్ధిబన్ సోషల్ మీడియా వేదికగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు.
ఇంకా
4.
రిటైర్డ్ జడ్జిని కూడా వదలని సైబర్ నేరగాళ్లు.. డిజిటల్ అరెస్ట్తో రూ.1.66 కోట్లు టోకరా - 2026-03-09T16:21:01+05:30
మనీలాండరింగ్ కేసు పేరుతో సైబర్ నేరగాళ్లు ఏకంగా రిటైర్డ్ జడ్జినే బోల్తా కొట్టించారు. డిజిటల్ అరెస్ట్ చేసి.. భారీగా సొమ్మును కొట్టేశారు. దీంతో ఆ విశ్రాంత న్యాయమూర్తి నుంచి పలు దఫాలుగా మొత్తం రూ.1.66 కోట్లను దోచుకున్నారు. సీబీఐ అధికారి అంటూ ఫోన్ చేసి.. రిటైర్డ్ జడ్జిని భయపెట్టిన ఆ సైబర్ కేటుగాళ్లు.. మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా, దొంగతనం వంటి నేరాలు ఉన్నాయని చెప్పి.. అతడి నుంచి డబ్బును లాగేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంకా
5.
నేను ఎంత మందితో తిరిగితే మీకు ప్రాబ్లమ్ ఏంటి? నాకు ఎవరితో లింక్లు ఉన్నాయో పేర్లు చెప్పండి: యాంకర్ రష్మి గౌతమ్ - 2026-03-09T16:22:36+05:30
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్తో పాపులర్ అయిన యాంకర్ రష్మి మరోసారి ట్రోలింగ్ బారిన పడింది. ఈసారి ఆమె క్యారెక్టర్ గురించి నీఛమైన కామెంట్లు పెడుతూ.. ఆమెకి చాలామందితో ఎఫైర్లు ఉన్నాయని నోటికొచ్చినట్టు పేలాడు ఓ నెటిజన్. దానిపై రియాక్ట్ అయిన రష్మి.. అర్థరహితంగా ఆధారంలేకుండా నొటికొచ్చినట్టు పేలడం కాదు.. తనకి ఎవరితో ఎఫైర్ ఉందో నిరూపించాలంటూ సవాల్ చేసింది. అసలు రష్మి గౌతమ్పై ఆ నెటిజన్ ఎందుకు నోరు పారేసుకోవాల్సి వచ్చిందో పూర్తి కథనంలో చూడండి.
ఇంకా
6.
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత.. - 2026-03-09T15:33:55+05:30
Kavuri Sambasiva rao passed away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఇక లేరు. తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కావూరి సాంబశివరావు సోమవారం తుదిశ్వాస విడిచారు.. ఐదుసార్లు ఎంపీగా గెలుపొందిన కావూరి సాంబశివరావు.. ఓసారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. కావూరి మరణంపై తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇంకా
7.
పశ్చిమాసియా యుద్ధంపై పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన - 2026-03-09T15:53:14+05:30
గత నెల 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్తో యుద్ధం మొదలైంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. దీంతో ఆ దేశాల్లో ఉపాధి, ఉద్యోగం కోసం వెళ్లిన భారతీయులు, పర్యాటకులుపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో వారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు భారత్ చేపట్టింది. ఇదే విషయం కేంద్ర విదేశాంగ మంత్రి రాజ్యసభలో ప్రకటన చేశారు.
ఇంకా
9.
తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్టేడియం ఆధునికీకరణ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు - 2026-03-09T15:22:52+05:30
తెలంగాణలో క్రీడాకారులను మరింత ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీలో అత్యాధునిక సౌకర్యాలను కల్పించడంపై చర్చించారు. ఇప్పటివరకు ఉన్న మైదానాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ వర్సిటీ డిజైన్లను పరిశీలించారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చేలా నిర్మాణాలు చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశాలు ఇచ్చారు.
ఇంకా