1.
SRHకి దొరికిన ఆణిముత్యం ఇషాన్ మలింగ.. ముంబై ఓటమికి, సన్రైజర్స్ విజయానికి తేడా ఒక్కడే..! - 2026-04-30T07:49:56+05:30
ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దొరికిన ఆణిముత్యం ఇషాన్ మలింగ. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన ఇషాన్ మలింగ 15 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహా బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకుంటే ఇషాన్ మలింగ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. మొత్తం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన మలింగ 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.
ఇంకా
2.
తీరనున్న రైతుల సాగు కష్టాలు.. తుమ్మిడిహెట్టికి సీఎం ఆమోదం, 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ - 2026-04-30T09:17:18+05:30
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ కార్యాచరణను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించి, 100 టీఎంసీల నీటిని గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారం కోరుతూ లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఆదిలాబాద్ మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందుతుందన్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీ జియో టెస్టింగ్ పనులను వానలు పడేలోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
ఇంకా
3.
ఏపీలో కొత్త గ్రీన్ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో వెళ్లొచ్చు - 2026-04-30T09:04:06+05:30
Chittoor To Thatchur Greenfield Highway 716B: ఏపీలో మరో హైవే అందుబాటులోకి వచ్చింది. చిత్తూరు-తచ్చూరు నయా ఎక్స్ప్రెస్ వేలో.. వాహనాల రయ్రయ్ అంటూ దూసుకుపోతున్నాయి. ఈ హైవే మొత్తం 116.5 కి.మీ కాగా.. 92 కి.మీ పనులు పూర్తి చేశారు. దీంతో ఈ హైవేలో ప్రయోగాత్మకంగా వాహనాలను అనుమతించారు. ఏపీలో 75 కిమీ అందుబాటులోకి వచ్చింది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రూ.5,488.32 కోట్లతో చేపట్టారు. ఈ హైవే రెండు పోర్టుల్ని కనెక్ట్ చేస్తోంది.
ఇంకా
4.
IPL హిస్టరీలోనే శార్దూల్ లాంటి ఇంపాక్ట్ ప్లేయరే లేడు.. నో బ్యాటింగ్, నో బౌలింగ్.. ఓన్లీ ఫీల్డింగ్! - 2026-04-30T08:55:13+05:30
ముంబై ఇండియన్స్ - సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన శార్దూల్ ఠాకూర్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన శార్దూల్ ఠాకూర్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ సమయంలో గ్రౌండ్లో వచ్చాడు. ఏడో ఓవర్లో వచ్చిన శార్దూల్ ఠాకూర్కి మ్యాచ్ ముగిసే వరకూ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగే ఇవ్వలేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ఒక ప్లేయర్కి బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ ఇవ్వకపోవడం ఇదే తొలిసారి.
ఇంకా
5.
టాప్- 5 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్.. లక్షకు 3 లక్షలొచ్చాయ్.. లిస్టులో ఎస్బీఐ, ఎల్ఐసీ..! - 2026-04-30T08:39:17+05:30
LIC MF Infrastructure Fund: చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతుంటారన్న సంగతి తెలిసిందే. ఇక్కడ స్టాక్ మార్కెట్లలో మాదిరిగా నేరుగా రిస్క్ ఉండదు. దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా మంచి రాబడి వస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు గత ఐదేళ్ల వ్యవధిలో లంప్సమ్ పెట్టుబడులపై కాసుల పంట పండించిన టాప్- 5 స్కీమ్స్ గురించి చూద్దాం.
ఇంకా
6.
టూరిస్ట్ వీసాపై వచ్చి మతబోధనలు.. అమెరికన్లకు షాకిచ్చిన భారత్.. దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు..! - 2026-04-30T06:55:15+05:30
టూరిస్ట్ వీసాపై పుణెకు వచ్చిన ముగ్గురు అమెరికన్లు.. మత ప్రచారకులుగా అవతారమెత్తారు. ఎక్కడ పడితే అక్కడ కనపడిన వారందరినీ క్రైస్తవ మతంలోకి మారాలని చెప్పారు. బైబిళ్లు, కరపత్రాలు కూడా పంచారు. దీంతో ఓ ట్యాక్సీ డ్రైవర్ వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున కరపత్రాలు, బైబిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మే 10వ తేదీలోగా దేశం విడిచి వెళ్లాలని వారిని ఆదేశించారు.
ఇంకా
7.
ఫెయిల్ అవుతాన్న భయంతో సూసైడ్.. ఫలితాల్లో ఫస్ట్ క్లాస్లో పాస్, ఎంత విషాదం - 2026-04-30T08:27:14+05:30
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్పల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ అనే విద్యార్థిని పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్య చేసుకుంది. అయితే బుధవారం విడుదలైన ఫలితాల్లో ఆమె 480 మార్కులతో ఉత్తీర్ణురాలైంది. పరీక్షల ఒత్తిడి, భయం కారణంగా ఒక ప్రతిభావంతమైన విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం తండాలో విషాదం నింపింది. ఫలితాల కోసం వేచి చూడకుండానే ఆమె తనువు చాలించడం అందరినీ కలచివేస్తోంది.
ఇంకా
8.
ఇరాన్లో 21 మందికి ఉరి.. 4 వేల మంది అరెస్ట్: తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి - 2026-04-30T08:28:38+05:30
ప్రపంచం దృష్టి మొత్తం ఇరాన్ సరిహద్దుల మీద ఉంటే.. ఇరాన్ పాలకుల దృష్టి మాత్రం తమ సొంత పౌరుల ప్రాణాల మీదే ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. యుద్ధం ముసుగులో ప్రభుత్వానికి వ్యతిరేకగా నోరు ఎత్తిన వారికి ఉరిశిక్షలు వేస్తూ.. వేలాది మందిని అరెస్ట్ చేస్తోందని స్పష్టం చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 21 మందిని చంపి.. 4 వేల మందిని అదుపులోకి తీసుకుని జైళ్లలో పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తం చేసింది.
ఇంకా