1.
చేతులారా మ్యాచ్ చేజార్చుకున్న భారత్.. ఇకపై ప్రతి మ్యాచ్ డూ-ఆర్-డై..! - 2026-06-21T22:52:19+05:30
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టుకు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్పై ప్రొటీస్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 158/7 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ (31) రాణించింది. అనంతరం 159 రన్స్ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా, మారిజాన్నే కాప్ (45 బంతుల్లో 81 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్తో మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
ఇంకా
2.
పిఠాపురం: ఫ్రిజ్లో నీళ్లు తేలేదని.. తల్లిని చంపిన కొడుకు - 2026-06-21T23:24:34+05:30
కాకినాడ జిల్లాలోని పిఠాపురం మండలం చిత్రాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫ్రిజ్లోని మంచినీళ్లు అడిగితే త్వరగా తేలేదనే కోపంతో కసాయి కొడుకు కన్నతల్లిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగమణి అనే మహిళ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. జూన్ 9 నుంచి కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. పరిస్థితి విషమించటంతో ఆదివారం కన్నుమూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇంకా
3.
పోలీస్ స్టేషన్కు రండి.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు నోటీసులు - 2026-06-21T22:20:20+05:30
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూన్ 22వ తేదీ సోమవారం రోజున విచారణ కోసం పోలీస్ స్టేషన్కు రావాలంటూ దువ్వాడకు నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇంకా
4.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు షాక్.. మరో కేసు నమోదు.. - 2026-06-21T21:10:52+05:30
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు షాక్ తగిలింది. బ్రహ్మనాయుడుపై తాజాగా మరో కేసు నమోదైంది. గండిపేట కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో బ్రహ్మనాయుడు జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం అనుమతి లేకుండా నరసరావుపేట నుంచి వినుకొండ వరకూ ర్యాలీ నిర్వహించారంటూ వినుకొండ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బ్రహ్మనాయుడు ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తినట్లు పేర్కొన్నారు.
ఇంకా
5.
విద్యుత్ ఉద్యమం తరహాలో పోరాటం.. కలెక్టరేట్ల ముట్టడి, ఇందిరాపార్కు వద్ద ధర్నా: కూనంనేని - 2026-06-21T22:15:46+05:30
తెలంగాణలోని నిరుపేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు సాధించడమే లక్ష్యంగా వామపక్ష పార్టీలు విద్యుత్ ఉద్యమం తరహాలో సరికొత్త పోరాటానికి రెడీ అయ్యాయి. హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం, గోపాల్పూర్లలో పేదల గుడిసెలను అర్ధరాత్రి వేళ అక్రమంగా కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 27న హనుమకొండలో 10 వేల మందితో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అలాగే జూలై 1న కలెక్టరేట్ల ముట్టడి, జూలై 6న ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టి, సేకరించిన దరఖాస్తులను నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.
ఇంకా
6.
‘అమ్మ’ రాజీనామా.. కుట్రలు చేస్తున్నారని నటి శ్వేతా మీనన్ ఆరోపణలు! - 2026-06-21T22:49:35+05:30
మలయాళ చిత్ర పరిశ్రమ నటీనటుల సంఘం ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (AMMA) లో ఊహించని సంక్షోభం తలెత్తింది. అంతర్గత విభేదాలు, ఆర్థిక అవకతవకల ఆరోపణలు, స్పాన్సర్షిప్ వివాదాలు ముదరడంతో సంఘం అధ్యక్షురాలు, నటి శ్వేతా మీనన్తో పాటు కార్యవర్గ సభ్యులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. 2025 ఆగస్టులో ఎన్నికై, ‘అమ్మ’ చరిత్రలోనే అత్యున్నత పదవులు చేపట్టిన తొలి మహిళా ద్వయంగా శ్వేతా మీనన్, కుక్కు పరమేశ్వరన్ నిలిచారు. అయితే, ఏడాది కూడా గడవకముందే కమిటీ రద్దవడం సంచలనంగా మారింది.
ఇంకా
7.
సైబర్ బాధితులకు ఊరట.. 6,303 మంది బాధితులకు రూ. 45.21 కోట్లు రిఫండ్ - 2026-06-21T21:36:17+05:30
తెలంగాణలో ప్రత్యేకంగా నిర్వహించిన లోక్అదాలత్ ద్వారా 6303 మంది సైబర్ మోసం బాధితులకు రూ. 45.21 కోట్ల నగదును రీఫండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా రూ. 21.91 కోట్లు రికవరీ అయ్యాయి. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 59953 మంది బాధితులకు రూ. 445.41 కోట్లు తిరిగి ఇప్పించారు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
ఇంకా
8.
అర్ధరాత్రి సమయంలో అల్లుడి నుంచి ఆ ఫోటో వచ్చింది.. రాధా గాయత్రి తండ్రి అనుమానాలు.. - 2026-06-21T19:08:54+05:30
టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాధా గాయత్రి తండ్రి ఫిర్యాదు మేరకు శ్రీచరణ్ మీద ముస్సోరి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అలాగే ఆమె మరణంపై కుటుంబసభ్యులకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇక ఫిర్యాదు సందర్భంగా అల్లుడు శ్రీచరణ్ మీద సుధాకర్ 11 అనుమానాలు వ్యక్తం చేశారు. వీటిపై దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇంకా
9.
శ్రీలంకకు చుక్కలు చూపించిన బుడ్డోడు.. ట్రై సిరీస్ భారత్ వశం..! - 2026-06-21T21:00:17+05:30
శ్రీలంక వేదికగా జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో లంక-ఏ జట్టును 66 పరుగుల తేడాతో ఓడించి ఇండియా-ఏ టైటిల్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్, వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 94), తిలక్ వర్మ (67) రాణించడంతో 50 ఓవర్లలో 377/9 భారీ స్కోరు చేసింది. అనంతరం 378 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక-ఏ జట్టును భారత్ 311 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో బౌలర్లు యశ్ ఠాకూర్ (3), విప్రాజ్ నిగమ్ (3) సత్తాచాటారు.
ఇంకా
10.
ఇరాన్పై బాంబుల వర్షం తప్పదు.. మరోసారి ట్రంప్ సీరియస్ వార్నింగ్ - 2026-06-21T20:31:25+05:30
పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్లో తుది దశ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ చర్చలు జరుగుతున్న తరుణంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. లెబనాన్లోని ఇరాన్ అనుకూల ప్రాక్సీ గ్రూపులు తక్షణమే దాడులను ఆపాలని.. లేనిపక్షంలో గత వారం కంటే దారుణంగా ఇరాన్పై దాడులు చేస్తామని ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇంకా