1.
ప్చ్.. బ్యాచిలర్స్కి మార్కెట్లూ కలిసిరాట్లే..పెళ్లయిన వారికే ఎక్కువ లాభాలు! - 2024-07-27T07:58:20+05:30
SEBI: పెళ్లికి ముందే సంపాదించాలని స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న బ్యాచిలర్స్కి ఇది షాకింగ్ వార్తే. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్ క్యాష్ విభాగం పెళ్లికాని వారికి పెద్దగా కలిసి రావడం లేదు. బ్యాచిలర్స్తో పోలిస్తే పెళ్లయిన వారు, మహిళలే ఎక్కువగా లాభాలు అందుకుంటున్నారటా. ఈ విషయం స్వయంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది.
ఇంకా
2.
ఏపీలో మరోసారి ఎన్నికలు.. ఈ ఎమ్మెల్సీ స్థానాల్లోనే, కీలక ప్రకటన - 2024-07-27T07:20:31+05:30
Andhra Pradesh Graduate Mlc Election Voters Registration: ఏపీలో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. అలాగే శ్రీకాకుళం-విజయనగరం- విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గానికి, కృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితాల్లో పేర్ల నమోదుకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 2024 నవంబరు 1 నాటికి జాబితా రూపోందించేలా షెడ్యూలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు.
ఇంకా
3.
రాయలసీమవాసులకు కేంద్రం శుభవార్త.. కీలక ప్రకటన - 2024-07-27T07:56:25+05:30
Bangalore To Kurnool Flight Service: కేంద్రం రాయలసీమవాసులకు శుభవార్త చెప్పింది.. ఈ విషయాన్ని నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి వెల్లడించారు. కొంతకాలంగా ఆగిపోయిన బెంగళూరు విమాన సర్వీసుకు సంబంధించి తన రిక్వెస్ట్పై కేంద్ర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు స్పందించారన్నారు. వచ్చే నెల నుంచి ఈ విమాన సర్వీస్ ప్రారంభమవుతుందన్నారు. అంతేకాదు కర్నూలు నుంచి మరికొన్ని విమాన సర్వీసులపై రిక్వెస్ట్ చేయగా.. సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంకా
4.
Bengaluru: వామ్మో ఆమె క్యాబ్ ఖర్చే రూ.16 వేలట.. సొంత కారే కొనుక్కోవచ్చు మరి! - 2024-07-27T07:38:06+05:30
ప్రస్తుత సమయంలో మహా నగరాల్లో ఆఫీసులకు వెళ్లి రావడం సాధారణ విషయం కాదు. మెట్రోలు, లోకల్ రైళ్లు ఎన్ని ఉన్నా.. రోడ్లపై మాత్రం రద్దీ పెరుగుతుంది గానీ... ట్రాాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభించడం లేదు. ఇక, దేశ ఐటీ రాజధాని బెంగళూరులో పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఆ నగరంలో ఆఫీసుకెళ్లడం ఉద్యోగులకు ఓ రకంగా టాస్కే. సాధారణ రోజుల్లోనే గంటలు పడితే.. చినుకు పడిందా వారికి అక్కడే సగం రోజు గడిచిపోతుంది.
ఇంకా
5.
ఆ బ్యాంకులపై RBI కొత్త రూల్స్.. నియంత్రణాపరమైన పర్యవేక్షణకు చర్యలు! - 2024-07-27T07:13:39+05:30
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు దివాలా తీసి ఖాతాదారులు నష్టపోకుండా ఉండేందుకు అవసరమైన సమయంలో నియంత్రణాపరమైన పర్యవేక్షణా చర్యలు తీసుకునేందుకు ఆ బ్యాంకులపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సత్వర దిద్దుబాటు చర్యలను ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఇంకా
6.
హైదరాబాద్- బెంగళూరు మధ్య కొత్తగా హైస్పీడ్ హైవే... ఇక నాలుగు గంటలే ప్రయాణం! - 2024-07-27T06:45:53+05:30
దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానం చేసి.. రాకపోకలను మరింత సులువుగా సాగాలే కేంద్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపడుతోంది. ఇందులో భాగంగా చేపట్టిందే ఎక్స్ప్రెస్వేలు. వీటితో పాటు కొత్తగా హైస్పీడ్ హైవేలను కూడా నిర్మించే ప్లాన్లో ఉంది. తాజాగా, బెంగళూరుకు హైదరాబాద్ నగరం నుంచి కొత్త హైవే నిర్మాణం చేపడతారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ రూపకల్పనకు టెండర్ ప్రక్రియ కూడా చేపట్టింది. ప్రస్తుతం ఉన్న హైవే 44కి ఇది అదనం
ఇంకా
7.
జులై 31లోపు ITR ఫైల్ చేయండి.. ఆ వార్తలపై ఐటీ శాఖ కీలక ప్రకటన! - 2024-07-27T06:40:42+05:30
ITR Filing Deadline: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్నులు ఈ నెల 31వ తేదీలోపు దాఖలు చేయాలని ఐటీ విభాగం కోరుతోంది. గడువును మరో నెల రోజులు పొడిగిస్తాన్న వార్తల్లో నిజం లేదని మరోసారి స్పష్టం చేసింది. ఇంకో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. గడువు దాటితే రూ.5 వేల వరకు ఫైన్ కట్టాల్సి వస్తుంది.
ఇంకా
8.
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. అక్కడా దర్శన టికెట్లు జారీ, కౌంటర్ ఏర్పాటు - 2024-07-27T06:38:48+05:30
Srivani Ticket Counter Change In Tirumala: తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా టికెట్లు జారీ చేసే కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జే శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈవో స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. ఆ వెంటనే.. దీని స్థానంలో డీఎఫ్వో కార్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన టికెట్ల జారీ కౌంటర్లు.. 200 మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇంకా
9.
మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర.. వారంలో రూ.5000 డౌన్.. తులం రేటు ఎంతకు దిగొచ్చిందంటే? - 2024-07-27T06:00:20+05:30
Gold Rate Today: బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం. బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసిన క్రమంలో బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇవాళ మళ్లీ రూ.1000 మేర దిగివచ్చింది. గత వారం రోజుల్లోనే తులం బంగారం రేటు ఏకంగా రూ.5 వేలకుపైగా పడిపోయింది. వెండి రేటు భారీగా దిగివచ్చి స్థిరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో జులై 27వ తేదీన హైదరాబాద్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం
ఇంకా
10.
తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. ఆ సమస్యకు చెక్, వాళ్లకు వార్నింగ్! - 2024-07-27T06:02:46+05:30
TTD Eo On Quality Of Food In Tirumala: తిరుమలలో ఫుడ్ క్వాలిటీపై ఫోకస్ పెట్టింది టీటీడీ.. ఈ మేరకు ఈవో జే శ్యామలరావు దూకుడు పెంచారు. ఇటీవల హోటల్స్, క్యాంటీన్లకు సంబంధించిన పరిణామాలతో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో హోటల్స్, క్యాంటీన్ల నిర్వహకులతో సమీక్ష చేశారు. కచ్చితంగా ఆహారం విషయంలో నాణ్యత పాటించాలని.. పరిశుభ్రత, పారిశుద్ధ్యం పాటించాలని సూచించారు. అలాగే ధరల పట్టికల్ని కూడా కచ్చితంగా హోటల్స్లో ఉండాలని సూచించారు.
ఇంకా