1.
CSK vs KKR: ఆఖర్లో కేకేర్ బౌలింగ్ మ్యాజిక్.. తేలిపోయిన సీఎస్కే హిట్టర్లు! - 2026-04-14T21:26:50+05:30
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సీఎస్కే 200 స్కోర్ రీచ్ కాలేకపోయింది. తొలి పది ఓవర్లలో వందకు పైగా పరుగులు రాబట్టిన సీఎస్కే ఆఖర్లో తేలిపోయింది. సులభంగా 220కు పైగా పరుగులు వస్తాయనుకున్న ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ స్ట్రాటజీతో సీఎస్కే 192 పరుగులకే పరిమితమవ్వాల్సి వచ్చింది. సంజూ శాంసన్ 48, డివాల్డ్ బ్రెవిస్ 41 పరుగులు చేశారు. శివమ్ దూబే 12 బంతుల్లో కేవలం 13 పరుగులే చేశాడు.
ఇంకా
2.
ఏపీలో రేపే ఇంటర్ ఫలితాలు విడుదల.. వాట్సాప్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి.. - 2026-04-14T21:07:56+05:30
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఉదయం పది గంటల 31 నిమిషాలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్ సైట్తో పాటుగా.. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఇంకా
4.
కనీస వేతనం రూ.69000, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.83.. ఉద్యోగుల తుది మెమోరండంలో కీలక ప్రతిపాదనలివే..! - 2026-04-14T20:21:06+05:30
8th Pay Commission minimum salary: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి 8వ పే కమిషన్లో కనీస వేతనం రూ.69 వేలుగా ఉండాలని, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.83 శాతం ఇవ్వాలని ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. 8వ సీపీసీకి ఉద్యోగుల తరపున కీలక ప్రతిపాదనలతో తుది మెమోరండం అందించింది. అలాగే 18 ఉద్యోగ స్థాయులను విలీనం చేస్తూ సర్వీస్ సమయంలో కనీసం 5 ప్రమోషన్లు కల్పించాలని కోరింది. ఉద్యోగుల ప్రతిపాదనల్లో కీలక అంశాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఇంకా
5.
ట్రంప్తో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఇరాన్ యుద్ధం, వాణిజ్యంపై ఇరువురి మధ్య చర్చ - 2026-04-14T20:54:05+05:30
భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేసి దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలు, భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. కాల్పుల విరమణ తర్వాత మోదీతో ట్రంప్ మాట్లాడటం ఇదే మొదటిసారి. అమెరికా, ఇరాన్ మధ్య సంఘర్షణను ముగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇరు దేశాల మధ్య పాక్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
ఇంకా
6.
మోదీ సర్కార్పై రేవంత్ యుద్ధం.. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు పిలుపు, స్టాలిన్కు లేఖ - 2026-04-14T20:03:02+05:30
డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. మోదీ సర్కార్పై యుద్ధం చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే స్టాలిన్కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల సీఎంలు కలిసి రావాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇంకా
7.
రోడ్డు ప్రమాదంలో పీఏ మృతి.. హుటాహుటిన ఢిల్లీ నుంచి వచ్చేసిన ఎంపీ.. - 2026-04-14T20:00:05+05:30
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కన్నీళ్లు పెట్టుకున్నారు. పీఏ రాజేష్ నాయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో హుటాహుటిన ఢిల్లీ నుంచి కర్నూలుకు చేరుకున్న ఎంపీ శబరి.. రాజేష నాయుడు మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చి.. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. రాజేష్ నాయుడు గత 20 ఏళ్లుగా బైరెడ్డి కుటుంబం వద్ద పనిచేస్తున్నారు. ఆయన చనిపోవటంతో కుటుంబ సభ్యుణ్ని కోల్పోయినట్లు ఉందని ఎంపీ బైరెడ్డి శబరి ఎమోషనల్ అయ్యారు.
ఇంకా
8.
డీలిమిటేషన్పై రేవంత్ రెడ్డి పోరాటం ఉద్ధృతం.. ప్రధాని మోదీకి లేఖ, లోక్సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం - 2026-04-14T19:27:18+05:30
గత కొన్ని రోజులుగా డీలిమిటేషన్పై కీలక వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా కేంద్రంపై తన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయొద్దని డిమాండ్ చేస్తున్న రేవంత్.. ఇప్పటికే కేంద్రానికి కీలక ప్రతిపాదనలు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేంద్రం డీలిమిటేషన్పై ప్రతిపాదనలు విడుదల చేయడంతో.. ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి ఒక లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని కోరారు.
ఇంకా
9.
అమెరికా దిగ్బంధనాన్ని తప్పించుకుని, హర్మూజ్ దాటిన రెండు నౌకలు - 2026-04-14T19:51:44+05:30
రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయని భావించారు. కానీ, పరిస్థితిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇరాన్, అమెరికా మధ్య శనివారం జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం జరగకుండానే ముగిశాయి. దీనికి ఇరాన్ అనుసరించి విధానమే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అంతేకాదు, హర్మూజ్ జల సంధిని తెరవడానికి ఒప్పుకుని ఇరాన్ సీజ్ఫైర్ నిబంధనలను ఉల్లంఘించిందని మండిపడుతున్నారు. దీంతో ఇరాన్ పోర్టులను దిగ్బంధించింది.
ఇంకా
10.
KKRపై విన్నింగ్ టీమ్తోనే బరిలోకి సీఎస్కే.. చెపాక్లో మళ్లీ చెన్నైదే ఫస్ట్ బ్యాటింగ్! - 2026-04-14T19:26:55+05:30
ఐపీఎల్లో ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్కి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలిచిన జట్టుతోనే సీఎస్కే బరిలోకి దిగగా.. కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం వరుణ్ చక్రవర్తి అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది.
ఇంకా