Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. ఏ ప్రాంత గనులు చూసినా ఏమున్నది గర్వకారణం, సమస్తం అక్రమార్కుల సక్రమ దొపిడీలకే సొంతం, అధికార పంతం. చంద్రన్న అయినా, జగనన్న అయినా, మార్పులు ఉంటాయా?
* టీడీపీ హయాంలో అడ్డగోలు దోపిడీ
* ఖజానాకు భారీగా గండి, విజిలెన్స్ విచారణలో బయటపడ్డ అక్రమాలు
* ప్రకాశం జిల్లాలో 155 క్వారీలకు రూ.3,527 కోట్ల భారీ జరిమానా
* మైనింగ్ రాయల్టీ ఎగ్గొట్టిన, గ్రానైట్ ఫ్యాక్టరీలపై కొరడా
ఇది ఈ వారం మన సాక్షి లో వచ్చిన వార్త, ఎవరి పేర్లు రాయకుండా, పై పైన తూ తూ మంత్రము గా రాశారు. అధికార పత్రికే, నాయకుల పేర్లు రాయడానికి భయపడితే మనవారి పేర్లు దాచిపెడితే, ఇంక జర్నలిజం కు అర్ధం ఏముంది?
ఆ నాయకుల కు కూడా మంచో చెడ్డో, మనము తగిన ప్రచారం ఇవాలి కదా? వారికి నష్టం ఏముంది, ఆదాయం తగ్గదు కదా? ఎన్ని అక్రమాలు కేసులు, ఎంత ఎక్కువ పబ్లిసిటీ ఉంటే, ప్రజలు వారినే అధిక మెజారిటీ తో తమ నాయకులు గా గెలిపిస్తారు? వారినే, మన పార్టీలు ఉత్తము లు గా, భావించి టికెట్లు ఇస్తాయి.
మా చెడ్డ మంచి నాయకులు మాత్రం, ఎందుకు బాధపడతారు? ఏదో ఒక పబ్లిసిటీ వస్తుంది, జనం మనల్ని మరువలేదు అంటారు కదా?
వెనకపడ్డ మన జిల్లాలో, ఇంత ఆదాయం, మన సొంత ఆదాయమే సరిగ్గా ఉపయోగిస్తే, మన జిల్లా అభివ్రుద్దికి సరిపోతుంది, కానీ పట్టించుకునే, మన అభివ్రుద్ది కోసం వాడే, ఉత్తమ నాయకులు మరియు వారిని ఎన్నుకునే ఉత్తమ ప్రజలు ఏరి?
ఆ ఆదాయం అంతా, అక్రమ దోవలో, కొందరు వ్యక్తుల చేతుల్లో ఉండిపోతుంటే, మరి అప్పటి అధికార పక్షాన్ని బట్టి, ఇతరుల తప్పులు మాత్రమే బయట పడుతున్నాయి, వేధిస్తున్నారు. కొందరు కోర్టు కు వెళ్ళి, రక్షణ పొందుతున్నారు.
సిద్దాంతాలు, ఆత్మాభిమానం, క్రుతజ్ఞతలు, దైవభీతి, మంచి చెడు లేని, పిరికి పందలు, వెంటనే పార్టీ దూకేస్తున్నారు, తమ అక్రమాలు కొన సాగించడానికి, అక్రమార్జన లేనిదే వారికి నిద్ర పట్టదు.
ప్రజల సొమ్ము దోచిన ఎన్నో నాయక కుటుంబాలు నాశనమై, కాలగర్భం లో కలసినా కూడా, వీరికి బుద్ది రాదు.
నాటి రాక్షసులే ధైర్యముగా, మేము ఈ నగరాలను ఆక్రమిస్తున్నాము అని పబ్లిక్ గా చెపుతుంటే, నేటి రాక్షసులు వారి కన్నా నీచముగా దిగజారి, ధైర్యముగా తమ అక్రమాలను బయటకు గర్వముగా చెప్పలేకపోతున్నారు.
మరి అలాంటి వారికి రక్షణ ఇస్తూ అవే అక్రమాలను కొనసాగిస్తే, పార్టీలోకి ఆహ్వానిస్తే, మరి జగనన్నకు ద్రోహం చేసినట్లు కాదా? తెదేపా, వైకాపా ఒకటే, పాత సారా కొత్త సీసా అని మనమే ఒప్పుకున్నట్లు కాదా? అని వైసీపీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
తెదేపాలో మంత్రి గా జిల్లాలో ఒక వెలుగు వెలిగిన, సిద్దా గారు, తనను పెంచి పెద్ద చేసి మంత్రి పదవి ఇచ్చిన, తెలివి తక్కువ చంద్రన్న గా నిరూపించి ఆయనను విడిచి, కొత్త తాత్కాలిక గొడుగు కోసం, మంత్రి బాలినేని అండన చేరారు, విందు భోజనము ఫోటోలు మనము చూసాము.
అలాగే ఒకనాటి ప్రకాశం పులి, నేటి భీతి చెందిన పిల్లి గా చీరాల ఎమ్మెల్యే కరణం కూడా, అదే గొడుకు కింద సేద తీరు తున్నారు, ఒంగోల్ లోనే అండగా ఉంటూ, అని నాటి కరణం అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ పుత్రుల ఉజ్వల భవిష్యత్ ను వీరంతా, వారి చేతులతోనే కాలరాస్తున్నారు కదా అని వీరి అభిమానులు బాధపడుతున్నారు.
మరి వీరంతా తమ అవసరానికి, నేడు పార్టీలు మారితే, అక్రమాలు కొనసాగిస్తే, రేపు మరలా మారరా? అవే అక్రమాలు కొనసాగవా?
రేపు బాలినేని కి జగనన్న కు మాత్రం సున్నం పూయరా? అవినీతి అక్రమం లో కూడా, నీతి ఉండదా? అని జగనన్న అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు
ప్రకాశం జిల్లాలో గ్రానైట్ అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యం, అందులో సక్రమ మార్గాల కంటే, అక్రమ మార్గాలే ఎక్కువగా ఉంటాయి. క్వారీ తవ్వకాల్లో, అక్రమాలు జరిగినట్టు విజిలెన్సు నిర్ధారించింది. ఆ మేరకు ఫైన్లు కూడా విధించింది. ఈ వ్యవహారం కోర్టుల్లో ఉంది.
ఇక ఆ జిల్లాలోని సంతమాగులూరు, బల్లికురవ, మార్టూరు మండలాల్లో 300 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రాళ్ళని తీసుకొచ్చి, పలుకులుగా చేసి విక్రయించడం, ఈ ఫ్యాక్టరీల పని. క్వారీల తరహాలోనే ఈ ఫ్యాక్టరీలు కూడా వక్ర మార్గంలోనే పయనిస్తున్నాయి.
* కోట్లు ఫైన్లు వేసిన, శిద్దా సోదరులు, అందరూ వైసీపీ లో
* టీడీపీలో ధైర్యంగా నిలబడ్డ, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్
చీమకుర్తి క్వారీల్లో శిద్దా సోదరుల హవా ఉన్నట్టే, బల్లికురవ క్వారీల్లో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కి చెందిన క్వారీలు అనేకం ఉన్నాయి. ఈయనతో పాటూ గరికపాటి రామ్మోహనరావు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకి చెందిన క్వారీలున్నాయి.
వీరికే పార్టీలు టిక్కెట్ లు ఇస్తాయి, ప్రజలు కూడా, ఇలాంటి వారినే, ప్రేమతో గెలిపిస్తారు, ఇంకో పెద్ద అవినీతి నాయకులు దొరికిందాకా. మరి అక్రమార్కులను ప్రొత్సహిస్తున్నది, ప్రజలే కదా? తమ లాంటి సామాన్యులను, మంచివారిని, ఎమ్మెల్యే గా గెలిపించరు కదా?
జిల్లాకు గ్రానైట్ పరిశ్రమ జీవనాధారం. జిల్లాలో దాదాపు లక్షల మంది ఈ పరిశ్రమను నమ్ముకుని బతుకుతున్నారు. చీమకుర్తిలో దాదాపు 25 వేల మంది, బల్లికురవలోని క్వారీల్లో దాదాపు 15 వేల మంది, వాటి అనుబంధ పరిశ్రమల్లో దాదాపు 60 వేల మంది జీవిస్తున్నారు అని అంటున్నారు.
ఇంతకు ముందు క్యూబిక్ మీటర్లు వారీగా, తూకాలు వేసి అమ్ముకునేవారు. రాయల్టీ చెల్లించేవారు. ఇప్పుడు టన్నుల లెక్కల్లో లావాదేవీలు జరపాలి. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. తవ్వకాల్లో మిగిలిన వెస్టెజ్ అమ్ముకోలేరు.
సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిలు ఎక్కువ పెట్టడం వలన వ్యాపారంపై నిఘా కళ్ళు ఎక్కువవుతాయి. అందుకే దీనికి కూడా వక్రమార్గాలు, విరుగుడు మంత్రాలు కనిపెట్టే పనిలో, క్వారీల యజమానులు ఉన్నారు..!
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,070; 94 తత్వాలు (Tatvaalu) and views 184,765 Dt : 30-Jun-2021, Upd Dt : 30-Jun-2021, Category : Politics
Views : 595
( + More Social Media views ), Id : 1220 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
vigilance ,
prakasam ,
granite ,
intruders ,
claw ,
opposition ,
power ,
leaders ,
ysrcp ,
tdp ,
balineni ,
sidda ,
gottipati Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments