వండిన వెంటనే, భోజనము వేడి వేడిగా తినమనేవారు. కారణం, చల్లారిన పదార్థాలు పై - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2139 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2174 General Articles and views 2,219,678; 104 తత్వాలు (Tatvaalu) and views 245,314.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చూడండి, ముందు తరాల పెద్దల ముందు చూపు. అందరికీ తెలుసు ఇవి, కానీ నేటి పెద్దలే పాటించము, ఇంక పిల్లల కు ఏమి నేర్పుతాము శుచి శుభ్రత.

మొన్న ఒకరు అద్దెకు అడగడానికి వచ్చి అన్నమాట. మాకు, మన లేదా బంధువుల కంపైనా, ఇంపుగా ఇంట్లో నే మంచం పక్కనే ఉండాలి అండి. మా ఇంట్లో అందరూ బలం లేని వారు, బయట దాకా నడవలేరు అడుగులు వేయలేరు, అని నిజాయితీగా చెప్పారు.

కొన్ని పాత సాంప్రదాయాలు చూడండి, నేటి బాక్టీరియా క్రిములు వైరస్ తగ్గడానికి. మనకు బద్దకం పెరిగి, పాశ్చాత్య సాంప్రదాయం తో, మన పతనం మనమే చేసుకుంటున్నాం.

1. బాత్రూమ్, లెట్రిన్ ఇంట్లో కాకుండా, వెనుక పెరట్లో ఉండేవి. కారణం, క్రిములు. శుభ్రంగా కాళ్ళు చేతులు కడగందే, లోనికి వచ్చే వారు కాదు, రానిచ్చేవారు కాదు.

2. మంగలి షాపు తలపని కి మరియు చావు కు వెళ్లి వస్తే, పెరట్లో స్నానం చేసాకే ఇంట్లో కి అనుమతి. కారణం క్రిములు.

3. బయట నుంచి వచ్చి, చెప్పులు బూట్లు, ఇంటి బయట వదిలేవారు. మొఖము కాళ్ళు చేతులు కడిగేవారు. కారణం క్రిములు.

4. పురుడు పుట్టుక అన్నా, చివర చావు అన్నా, అంటు అని అందరికీ దూరంగా ఓ పది రోజులు ఉంచేవారు. చనిపోయిన వారి ఇంట్లో, వంట కూడా చేయరు. కారణం క్రిములు.

5. మట్టి, ఇత్తడి, రాగి పాత్రలు మాత్రమే వాడేవారు. కారణం క్రిములు. ఇప్పుడు స్టీలు బాక్స్ లు ఎగబడి ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, ఇళ్ళలో నింపేస్తున్నారు.

6. వండిన వెంటనే, భోజనము వేడి వేడిగా తినమనేవారు. కారణం, చల్లారిన పదార్థాలు పై, క్రిములు ఉండవచ్చు చేరవచ్చు. ఇప్పుడు ఫ్రిజ్ లో వారం దాకా ఉంచి, పాచిన తిండిని, మరీ లొట్టలు వేసుకుని తింటున్నాము, ఏ గడ్డి అయినా.

7. వంటా వార్పు చేసే వాళ్ళను, స్నానం చేస్తేనే, వంట చేసేందుకు, అనుమతి ఇచ్చేవారు. కొంత మంది మడితోనే, పూర్తి వంట చేస్తారు. కారణం, స్నానం చేయకుండా వండితే, క్రిములు చేరతాయని.

8. మనవారు బయటకు వెళితే సద్ది తో , మరచెంబు నీళ్ళు తో వెళ్ళేవారు. ఎందుకు? బయట కల్తీ లు, క్రిములు నుండి కాపాడుకునేందుకు.

9. ఇంట్లో ఉదయ సాయంత్ర పూజతో సాంబ్రాణి, కర్పూరం, దీపం, ధూపం వేసేవారు. కారణం క్రిములు. కానీ అవి మానేసి, దోమల నాశని అని, రాత్రి అంతా ఏదో ఒక దరిద్రాన్ని పీలుస్తున్నాం.

ఇలా ఎన్నో పాత పద్దతులు, హైందవ ధర్మం లో చెప్పబడినవి. ఇప్పుడైనా, కళ్ళు తెరుద్దాం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2174 General Articles and views 2,219,678; 104 తత్వాలు (Tatvaalu) and views 245,314
Dt : 28-Mar-2020, Upd Dt : 28-Mar-2020, Category : General
Views : 1071 ( + More Social Media views ), Id : 453 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona , covid 19 , old tradition , fresh air , strict rules for health
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content