ఏపీలో కూటమికే ఊహించని విజయం అధికారం - భవిష్యత్ పయనం? మాన్ ఆఫ్ ద మాచ్? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,136,615; 104 తత్వాలు (Tatvaalu) and views 239,953.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Alliances Unexpected Success in AP - Future Journey? Man of the match?

2024 లో మా 4 గురు పిల్లలు, పెద్దోడు బీజేపీ, 2 వ వాడు తెదేపా, 3 వ వాడు వైసీపీ, 4 వ వాడు జనసేన మరలా ఎన్నికల రంగంలో దిగింది మీకు తెలుసు. గెలుపు ఓటములు దైవాధీనం. గెలిచిన వారికి శుభాకాంక్షలు, ఓడిన వారికి తర్వాత గెలుపుకై ఆరాటం పోరాటానికి శుభాకాంక్షలు. సొంత అన్నకే ద్రోహం చెయ్యడానికి ముందుకు వచ్చిన కాంగ్రెస్స్ షర్మిలమ్మ ను ప్రజలు సత్కరించారు.

కన్నబిడ్డలు ఒకరినొకరు తూలనాడుతూ, అధికారం కోసం, ఈ రకముగా ఆవేశాలతో ఆవేదనలతో ఆలోచనలతో, నడి ఎండలో అరుస్తూ వగస్తూ, పరుగులు తీయడం ఎంత బాధకలిగించిందో మనకు.

మా పిల్లలు చల్ల గా ఉండాలి, ప్రజల మానసిక బలహీన అరిషడ్వర్గ అష్టవ్యసన మనో వికారాలు, మా పిల్లలకు అంటకూడదు, రజో తమో గుణాలతో పతనం కాకూడదు, అని మీకు మొదటి నుంచి ఏళ్ళుగా చెప్పాము, 2017 కు ముందే.

గత పెద్దలు చెప్పిన జీవిత పాఠాలు గుర్తు చేసాము - అధికారం, ధనం, హోదా శాశ్వతం కాదు. రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.

బీజేపీ తెదేపా జనసేన ఒకవైపు, వైసీపీ ఒకవైపు తాడో పేడో తెల్చుకోవాలని నిలబడ్డారు. అత్యంత ఉత్కంఠ, ఎవరు గెలుస్తారు, వెన్నుపోటా గుండెపోటా, నక్కా పామా పులా అంటూ కోట్లలో బెట్టింగులు. వారి అంకెలు, వీరి అంకెలు, ఎన్నో 2 నాల్కలు. ఏ ఒక్కరూ కూడా, ఆవును ఒంటరిగా గెలిపించాలని అనుకోలేదు.

కాస్త వెనక్కు వెళదాము, అక్కడ నుంచి ముందుకు వద్దాము. గతము మరువ కూడదు. మనము పతనము అయ్యే స్తితిలో, చేయూత ఇచ్చిన వారిని మరువకూడదు జీవితాంతము.

చంద్రన్న ను అరెస్ట్ చేసి, జైలు లో పెట్టారు. లోకన్న, ఢిల్లీకి వెళ్ళి అజ్ఞాతములో ఉన్నారు. మనము ఇది తప్పు, ఆ పద్దతి బాగోలేదు, అని గట్టిగా చెప్పాము. తెదేపా సైన్యం ఏమీ చేయలేని పరిస్తితిలో మౌనముగా ఉంది. అప్పటికే అంటే ఏళ్ళు ముందు నుంచే పార్టీ లేదు, ఏమీ లేదు, అంతా అయిపోయింది, అని సొంత వారే విసుర్లు.

కరోనా సమయము నుంచి, బద్దకం నిర్లక్ష్యం నిశ్శబ్దం పార్టీ అంతా, ఏ కొద్ది మందో తప్ప. ఇక పార్టీ అయిపోతుంది అనుకున్నారు. కానీ అప్పుడే, పవన్ చెప్పిన సినిమా డైలాగ్, నాకో తిక్క ఉంది, దానికో లెక్క ఉంది అని, తన ప్రభావం చేయూత, ప్రభంజనములా మొదలు అయ్యింది. నేను మీకు అండ అన్నారు.

మా యువతరం ఉడుకు రక్తం, ఆవేశం, మీ అనుభవానికి తోడు అన్నారు. వైసీపీ రాక్షస అరాచకాలను తుద ముట్టిద్దాం అన్నారు. తాను జైలుకు వెళ్ళి చంద్రన్నను కలిసారు, నేను ఉన్నాను, చచ్చుబడిపోతున్న, వైసీపీ భయముతో వణికిపోతున్న పార్టీకి చేయూతనిస్తాను అని గుండె భరోసా ఇచ్చారు.

రోడ్లు ఎక్కారు, ధర్నాలు చేసారు, వైసీపీకి తలనొప్పి కలిగించారు. ఓట్లు వేసినా వేయకపోయినా, యువరక్తం పవన్ వెంట ఉంది అన్న నిజం వైసీపీకి, అలాగే చంద్రన్న కు తెలుసు. పవన్ వల్లనే గతములో చంద్రన్న ఓడింది, జగనన్న మెజారిటీ వచ్చింది అని ఇద్దరికీ తెలుసు.

పవన్ గతములో కూడా, చంద్రన్న కు ఎంతో అండగా ఉన్నారు, ఏ పదవీ ఆశించకుండా. అందుకే జగనన్న, పవనన్నను చంద్రన్న దత్తపుత్రుడు అని అనే వారు. ఆ గౌరవం ఆ త్యాగం లోకన్నకు కూడా దక్కలేదు, ఆ స్టామినా లేదు అని చంద్రన్న కు తెలుసు. అందుకే, ఈ చివరి ప్రచారం లో పక్కన పెట్టారు, తనకు పవన్ చాలు అని. తనను నిలబెట్టే వారసుడు పవన్ అని చంద్రన్న నమ్మారు, నమ్మలేము అని వారు అన్నా, పవన్ అలాగే నిలబెట్టారు, వైసీపీ ని అష్టదిగ్భంధనం చేసి.

మేము కూడా చెప్పాము, రావణ/ వాలి ని తుదముట్టించడానికి, అధర్మ పరులైన రావణ/ వాలి తో కలవడం కరెక్ట్ కాదు అని, ఓడిపోయినా ఆవు ఒంటరిగా వెళ్ళాలి, అది ప్రజల ఖర్మ ఓడిస్తే, భవిష్యత్ పరిణామాలు చూడండి అని చెప్పినా, తన స్తిర నిర్ణయం తో ముందుకు పోయారు. అదే తిక్కతో, ఇక మనము ఎలా రాజకీయలు చేస్తామో చూడండి అని చెప్పారు.

గత చంద్రన్న నెగటివ్ వీర విహారం తెలిసి, బీజేపీకి ఇష్టం లేకపోయినా, అన్ని వైపులా వైసీపీని ఎదుర్కోవాలి అంటే, ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటూ కూడా పోకుండా ఒడిసిపట్టుకోవాలి అంటే, మీ ఇద్దరు నా కోసం, ఆంధ్రా ప్రజల కోసం కలవక తప్పదు అని చెప్పి, ఒప్పించారు. అదే, వైసీపీ పతనానికి నాంది.

జనసేన సైన్యాలకు, గట్టిగా చెప్పారు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఓటు చీల్చ వద్దు, కూటమి అభ్యర్ధికే వేయమని. చంద్రన్న కూడా అదే ఆదర్శముగా తీసుకుని తమ అనుచరులకు అదే చెప్పారు.

పిఠాపురం లో పవన్ తప్పక గెలవాలని, స్థానిక అభ్యర్ధి వర్మ త్యాగంతో కష్టపడి పని చేసి, పవన్ ను అక్కడ గెలిపించారు. అలాగే పవన్ కష్టపడి తిరిగి, తెదేపాను గెలిపించారు. ఈ రోజు చంద్రన్న సీయెం అవుతున్నారు అంటే, అది పవన్ కల్యాన్ కష్టం, ముందు చూపు, ఆరాటం పోరాటం, అని యావత్ దేశం కొనియాడుతున్నది. మీరు మన వాట్సాప్ స్టేటస్ లో సాక్ష్యాలు చూసి ఉంటారు.

21 అస్సెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలలో, ఒక్కటి కూడా ఓడి పోకుండా, 100 శాతం గెలిచిన ఘనత తనదే, దేశం మొత్తములో. తాను తగ్గి, తక్కువ సీట్లు తీసుకుని, 135 అస్సెంబ్లీ 16 పార్లమెంట్ స్తానాలలో చంద్రన్న ను పైన నిలబెట్టారు. బీజేపీ కి 8 అస్సెంబ్లీ 3 పార్లమెంట్ గెలుపులు ఇచ్చారు. చంద్రన్న 45 శాతం వస్తే, జగనన్నకు 39 శాతం వచ్చింది, పవనన్న త్యాగముతో.

జగనన్నకు 11 అస్సెంబ్లీ 4 పార్లమెంట్ గెలుపులు మాత్రమే మిగిల్చారు. ఆఖరకు జగనన్న ను, పవనన్న కన్నా తక్కువ అస్సెంబ్లీ స్థానాలకు తీసుకుని వచ్చారు. అది ఘోర అవమానం, ఆంధ్రా చరిత్రలో. గతములో చంద్రన్నకు 23 వస్తే, ఇప్పుడు జగనన్నకు 11 వచ్చాయి. మొత్తుకున్నాము, మన మాట వినండి, నేల మీద నడవండి అని, కానీ ఎక్క లేదు. చీరాల జిల్లా కూడా ఇవ్వలేదు, ఫిషింగ్ హార్బర్ కట్టలేదు, ఒకరి మంచి కోరిక అన్నా తీరుస్తారు అంటే, అదీ లేదు.

మోదీ కూడా గర్వముగా చెప్పారు, ఆంధ్రాలో మనకు పవన్ ఉన్నారు అని. ఇప్పుడు మోదీ దగ్గర, పవన్ కే ఎక్కువ విలువ ఉన్నది, ఎటువంటి వెన్నుపోటు గుండెపోటు లేని, విశ్వసనీయత క్రుతజ్ఞత కలిగిన స్తిర వ్యక్తిగా.

ఇప్పుడు కాంగ్రెస్స్ గేలం వేస్తుంటే, పవన్ స్పష్టముగా చెప్పారు, మోదీ అంటే ఏమిటో, ప్రపంచము చూసింది ఇన్నాళ్ళు, నేను మోదీ తోనే, ఆఖరకు ప్రధాని పదవి ఇచ్చినా, కాంగ్రెస్ తో కలవను అని స్పష్టముగా స్తిరముగా చెప్పారు.

అన్న చిరంజీవి ఇంటికి వెళ్ళి, తల్లికి, అన్నకు, వదినకు పాదాభివందనం చేసి, హైందవ కుటుంబ విలువలను చాటారు.

ఆనాడు 2019 కు ముందు, మంచి చెప్పినా చంద్రన్న వినలేదు. ఈ రోజు 2024 కు ముందు మంచి చెప్పినా జగనన్న వినలేదు. మరి రేపు 2029 కు ముందు చంద్రన్న/ పవనన్న వింటారా? పార్టీ అధిష్టానాలకు కూడా, నాడు నేడు, పంపాము విన్నపాలు.

మరి భవిష్యత్ ఏమిటి? ఇప్పుడు చంద్రన్న ఒంటెద్దు పోకడలకు పోరు, అని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే, పవన్ చెప్పారు, మేము ప్రతి ఓటు భయముతో, బాధ్యత తో పని చేసి, ప్రజలకు సేవకులు గా ఉంటాము అని. అంటే, చంద్రన్నకు పవనన్నకు తెలిసి జరగాలి అన్ని విషయాలు రాష్ట్రములో. కేంద్రం, ఇద్దరి నుంచి సమాచారం తీసుకుంటుంది.

చంద్రన్నా, సొంత కోటరీ పసుపు మీడియా మాటలు వినవద్దు, వారు 2019 లో ముంచారు. అదే కోటరీ, అదే బులుగు మీడియా, ఇప్పుడు 2024 లో జగనన్నను ముంచారు.

1. ప్రజా ధన పధకాలకు, ఇక సొంత కుటుంబ పేర్లకు స్వస్తి చెపుతారా? అవి ఉపయోగం లేదు అని, 2019 అలాగే, 2024 లో నిరూపణ అయ్యింది. చంద్రన్న/ పవనన్న ఆసరా లాంటి సొంత పేర్లు వద్దు. దేవత లేదా గత స్వాతంత్ర ఉద్యమ నాయకుల పేర్లతో ఉండాలి.

2. ఇంత త్యాగాలు చేసిన పవన్ రుణం ఎలా తీర్చుకుంటున్నాము? డిప్యూటీ సీయెం నా? హోం మినిస్టర్ నా? లేదా ఎక్కువ విలువైన మంత్రి పదవులా? పవనన్నకు తన అనుచరులకు, మనకు అలవాటు అయిన వెన్నుపోటు, ఉండదా?

3. అందరు, ఇది కూటమి గెలుపుగా, మాత్రమే చెప్పాలి. కేవలము చంద్రన్న లేదా పసుపు మంద బలం అని చెప్పకూడదు. అది ఆత్మ ద్రోహం అవుతుంది. పవన్ కు అందరూ రుణ పడి ఉండాలి. మరలా కమ్మ కాపు రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ వర్గ పోరాటము లేకుండా, 2029 లో ఎలా నిలబడగలము అని మంచి ఆలోచన చెయ్యాలి.

4. వైసీపీ వారు, రాక్షసులు గా, మన మీద ఎన్నో కేసులు వేసి ముప్ప తిప్పలు పెట్టారు. అదే పని, మనము ఇప్పుడు చేస్తే, ఇక వారికి మనకు తేడా ఏముంది? అందరూ రాక్షసులమని ఒప్పుకున్నట్లేనా? మరి అప్పుడే, మన మందలు వీర విహారం చేయడం ప్రారంభించారు. దయచేసి వారిని ఆపండి. మనము అభివ్రుద్దితో ప్రజలను ముందుకు నడిపి, వైసీపీని పతనం చేద్దాము అని చెప్పండి.

5. మరి ఎన్నో ఉచిత పధకాలను పెట్టాము. వాటికి సంపద ఎలా స్రుష్టిస్తామో ఆలోచన చెయ్యండి. అప్పులు అలాగే ప్రజల పన్నులు, కరెంట్ చార్జీలు ఎలా తగ్గించాలి చూడండి.

6. ఐదు ఏళ్ళ వైసీపీ ప్రభుత్వం, పంచాయితీ పన్నులు ఆన్లైన్ లో కట్టడం ఇంతవరకు చెయ్యలేకపోయింది. మరి మనము చెయ్య గలమా వెంటనే చూడండి. కరెంట్ చార్జీలు కట్టే, చూపే వెబ్సైట్ పని చెయ్యడం లేదు, స్పందించడము లేదు, సరి చేయండి. పతనము అయిన వ్యవస్థలను నిలబెట్టండి.

7. ప్రతి పార్లమెంట్, జిల్లా, అస్సెంబ్లీ, గ్రామ పంచాయితీ అధికారులు/ నాయకులు, వాలంటీర్లు తమ పనులను రోజూ సోషల్ మీడియాలో పెట్టేట్లు జవాబు దారీ ఉండేట్లు చూడండి.

8. ప్రవేటు విద్యను ప్రొత్సాహం చేయవద్దు, ప్రభుత్వ విద్యను పెంచండి. ఇంగ్లీష్ తెలుగు రెండూ నేర్చుకునే అవకాశం ఇవ్వండి. తెలుగు రాయలేని, మంచి మనసు లేని, మానసిక బలహీన, తల్లి తండ్రి ద్రోహులు ఎక్కడ చూసినా. తెలుగు గురువులు బ్రహ్మం, వేమన, రాఘవేంద్ర స్వామి, అలాగే వారి రచనల/ మంచి పనుల, ప్రచారం ప్రాబల్యం పెంచండి.

9. వాలంటీర్ వ్యవస్థ, జగనన్న చేసిన మంచి పని, ఇంటికే ప్రభుత్వం దాని పనులు. ఫించను లేదా ఏ ప్రభుత్వ కాగితం అయినా, వాలంటీరు ఇంటికి తెచ్చి ఇచ్చారు. అది ఇంకా సమర్ధవంతముగా చెయ్యండి.

10. అమరావతి రైతులకు న్యాయం జరగాలి. కానీ 3 పంటల భూముల ధాన్యం నష్టపోకుండా చూడాలి. రాజధాని అభివ్రుద్ది, సింగపూర్ లాంటి ఇతర దేశాలకు తాకట్టు పెట్టకుండా, సొంత తెలివితో పెంచాలి.

11. నోరుపారేసుకునే పోసాని, రోజా, నాని లాంటి వారు మన మంత్రివర్గములో లేదా ఏ పదవిలో వద్దు. వారిని చూసి, యువత కూడా అలాంటి మాటలే నేర్చుకుంటారు. నాయకుడు అదుపులో ఉండాలి, తన వారిని ఉంచాలి.

ఇంకా ఎన్నో మంచి పనులు మీరు చెయ్యాలని, మన అందరి పేరు నిలబెట్టాలని ఆశిస్తూ.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,136,615; 104 తత్వాలు (Tatvaalu) and views 239,953
Dt : 06-Jun-2024, Upd Dt : 06-Jun-2024, Category : Politics
Views : 203 ( + More Social Media views ), Id : 2108 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : alliances , unexpected , success , ap , future , journey , man , match , 2024 , election , pavan , chandranna , jagananna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content