మనం మారుదాం, పార్టీ ని, అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల, అన్ని సమస్యలపై, పోరాడే పార్టీ గా నిలబెడదాం - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,356; 104 తత్వాలు (Tatvaalu) and views 225,056.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఎవరన్నా, మన లోకేష్ బాబు, చంద్రన్న ల కు, తెదేపా పార్టీ క్షేమం కోరే పెద్దలు కు, ఈ మెసేజ్ ఫార్వార్డ్ చేయండి.

తెలుగు దేశం పార్టీ వాట్సాప్ నంబరు కూడా, పని చేస్తున్నట్టు మాకు కనపడలేదు, ఒకవేళ మాకే ఇబ్బంది ఏమో. అధికారం లేనప్పుడే ఇలా ఉంటే, అధికారం లోకి వచ్చిన తర్వాత, అసలు పలకరు విలేఖరుల కు కూడా. ఇప్పుడు కైనా, ప్రజలు మనల్ని ఎందుకు ఇంత తిరస్కరించారో, ఆత్మ విమర్శలు చేసుకోవడం లేదు.

మనం జగన్ ట్రాప్ లో చిన్నగా పడుతున్నాము, అని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. మనం అమరావతి కి భూములు ఇచ్చిన రైతు నష్టం గురించి మాట్లాడుతూ ఉన్నామా లేక 3 రాజధానుల గురించి మాట్లాడుతూ, ధర్నా లు చేస్తున్నామా? రెండూ విషయాలు కలిపితే, మరలా రెండు కళ్లు సిద్ధాంతం అవుతుంది. మరలా మనకే నష్టం.

3 రాజధానులు గురించి మాట్లాడుతూ ఉంటే, వైజాగ్ మరియు కర్నూలు ప్రజల లో, మనం చెడు మరియు చులకన అవుతాము. అలాగే అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కు, అండగా ఉన్నట్లు, మనమే ఒప్పుకుంటున్నాం. పెట్టుబడి పెట్టిన పెద్ద తలకాయ లకు తప్ప, సామాన్య జనానికి, ఎక్కడ ఉంటే ఏమిటి నష్టం, అన్నట్లు గా ఉంది పరిస్తితి, ఎవరి ప్రభుత్వం ఎవరి అధికారం వారిది.

ఎందుకంటే గవర్నర్ గారి తప్పు నిర్ణయం అంటున్నారు మనవాళ్ళు, పబ్లిక్ గా. బీజేపీ జనసేన, మిగతా వారిది తప్పు కాదు, వారూ రైతులకు న్యాయం చేయాలనే అంటున్నారు. కోర్టు అవకాశం ఎటూ, మనకు ఉంది, రైతులకు అండగా. కానీ రాజధాని గురించి మనం కేసు వేసి, కోర్టు కొట్టివేస్తే, కర్నూలు వైజాగ్ ప్రజలు మనల్ని క్షమించరు. కాబట్టి, మన కేసులు, అమరావతి రైతులకు అండగా, నష్టపరిహారం వరకు మాత్రమే ఉండాలి, రాజధాని గురించి కాకుండా. అది ధర్మమేమో ఆలోచన చెయ్యండి. కనీసం పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, మళ్ళి ఎన్నికలకు వెళ్ళాలి, లేదంటే జనము నమ్మరు.

మన ధర్నాలు తో, రాంగ్ మెసేజ్ వెళ్ళకూడదు, ప్రజలకు. మనం, గత మన సామ్రాజ్యం లో సీబీఐ ని నిషేధించాం, మా రాష్ట్రం, మా ఇష్టం అన్నాం. పచ్చటి మూడు పంటల మాగాణి పొలాలు, కాంక్రీటు చేశాం, మా ఇష్టం, ప్రజాభిప్రాయం అన్నాం. ఆనాడు మన ప్రభుత్వ ఆడినట్లుగా, 150 ఎమ్మెల్యేల జగన్ ప్రభుత్వం ఆడకూడదు ఆడవద్దు అని, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో లేదో తెలియని ప్రతి పక్షముగా, మనకు హక్కు ఉందా? ఒకవేళ ఉన్నా, మీరు ఇష్టం వచ్చిన విధంగా చేసినట్టు గా, జగన్ గారికి తన ఇష్టం వచ్చిన విధంగా, చేసే హక్కు లేదా? కనీసం బీజేపీ, జనసేన మద్దతు కూడా పొందలేక పోతున్నాము మనం.

మనం పెట్టే ధర్నా ల ఫోటో లో, ఊరు జిల్లా పేరు, రాయడం లేదు. కర్నూలు వైజాగ్ ఎమ్మెల్యే లేదా 2 వ వార్డు మెంబర్లు, అని రాయండి. ప్రకాశం జిల్లాలో, తెదేపా గెలిచిన లేదా ఓడిన ఎమ్మెల్యేలు, లేదా పట్టణ జిల్లా అధ్యక్షులు కూడా, గట్టిగా ధర్నా చేయడం లేదు. కరోనా సమయంలో, మన వాళ్ళు ఎక్కడా స్ధానికంగా, సహయ కార్యక్రమంలో కనపడలేదు. అదేమంటే, మా నాయకులే హైదరాబాద్ లో ఉన్నారు కదా, అంటున్నారు.

ప్రకాశం జిల్లాలో ని అధికారులు, అభివృద్ధి పనుల మరియు కరోనా సమాచారం, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం లేదు అంటే, కనీసం ప్రజలకు అన్యాయం జరుగుతుందని, మీరు ధర్నా చేయరు. ఇలా గమ్ముగా అయోమయంలో ఉంటే, మరలా మన పార్టీ బతికి బట్ట కట్టేది ఎప్పుడూ, అని పార్టీ అభిమానులు శ్రేయోభిలాషులు వ్యధ చెందుతున్నారు.

దయచేసి ఆలోచన విధానం మార్చి, పార్టీ ని నిలబెట్టండి. పాత సలహ దారుల మాటలు, వినకండి, ఆల్రెడీ ముంచేశారు, అన్ని వర్గాల ప్రజలకు దూరం చేసారు.

వీర్రాజు గారు, ఆల్రెడీ చెప్పారు, వైకాపా ప్రధాన పోటీ బీజేపీ జనసేన మాత్రమే అని. తెదేపా తో విసుగు పుట్టి, వైకాపా తో జనం వెళ్ళారు. వైకాపా తో విసుగు పుట్టి, బీజేపీ కూటమి తో వెళ్ళవచ్చు నేమో అని. ఇంకోమాట కూడా ఆయన అన్నారు, వైకాపా తెదేపా కుల పార్టీలు అంటారు అందరూ, నేనైతే కుటుంబ పార్టీలు అంటాను అని, వాటికి వారి కుటుంబ క్షెమమే కావాలని, బీజేపీ మాత్రము సకల జనుల పార్టీ అని.

మోడీ గారు, పాకిస్థాన్, చైనా తో పోరాడుతుంటే, ప్రతిపక్షాలను వదిలి, ఇక్కడ రాష్ట్రంలో మాత్రం చిత్రమైన పోరాటాలు జరుగుతున్నాయి అని అన్నారు. కేవలము, అభివ్రుద్ది కోసము పోరాటము చేద్దాము.

మనం మారుదాం, మన పార్టీ ని, అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల, అన్ని సమస్యలపై, పోరాడే పార్టీ గా నిలబెడదాం. ప్రతి చిన్న అవకాశం ఉపయోగించు కుందాం, అన్ని వర్గాల ను కలుపుకుందాం. వీలైతే జూనియర్ ఎన్టీఆర్ సహాయం పొందైనా సరే, మనల్ని నమ్మిన జనానికి న్యాయం చేద్దాం, ఇది నిజమైన తెదేపా శ్రేయోభిలాషుల ఆలోచన.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,356; 104 తత్వాలు (Tatvaalu) and views 225,056
Dt : 02-Aug-2020, Upd Dt : 02-Aug-2020, Category : Politics
Views : 883 ( + More Social Media views ), Id : 625 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : change , stand , tdp , party , fight for all , region , communities , issues , tdp , nara , babu , lokesh
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content