ప్రభుత్వ ఎస్మా ఉత్తర్వు లు పాటించి తప్పనిసరి గా ప్రైవేట్ హాస్పిటల్స్ తెరిచి ప్రజలకి సేవ చేయాలి - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1801 General Articles and views 1,394,263; 94 తత్వాలు (Tatvaalu) and views 184,787.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యవసర సేవల చట్టం (ఎస్మా - ఎసెన్షియల్ సర్వీస్ మెయిన్టనెన్స్ ఆక్ట్ -1977)ని తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల పాటు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బందిని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ జీవో జారీ చేసింది. దీంతో ఈ కఠిన సమయాన విధులు నిర్వహించేందుకు నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉండనుంది.

ఇది చీరాల గురించే కాదు, మీ సొంత ఊళ్లో పరిస్థితి కూడా తెలుసు కోండి, ఏది మంచో ఏది చెడో నిర్ణయం మీదే. ఆసుపత్రులు తెరిచి ఉంచాలి అన్నది ప్రజా ఉపయోగము. ముఖ్యమంత్రి జగన్ గారి ఆకాంక్ష ప్రజల క్షేమము కోసము.

1) చీరాల లో గత కొన్ని రోజులు గా, తమ ప్రైవేట్ హాస్పిటల్స్ మూసేసి, ప్రజలకి సేవ చేయని కొంత మంది డాక్టర్స్ ని, సున్నితంగా అడిగిన ఆమంచి. కావాలంటే, ప్రొటెక్షన్ సామగ్రి మేము ఇస్తామని అన్నారు.

తప్పని సరిగా ప్రభుత్వ ఎస్మా ఉత్తర్వు లు పాటించి, ఇప్పటికైనా నిబంధనలకు లోబడి , తప్పనిసరి గా ప్రైవేట్ హాస్పిటల్స్ తెరిచి ప్రజలకి సేవ చేయాలి అని హితవు పలికారు.


2) మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు చేసిన వ్యాఖ్యల గురించి జవాబు

a) విజయ నర్సింగ్ హోం అధినేత, మాజిమంత్రి వర్యులు, మాజీ ఎమ్మెల్యే , వైసిపి నేత శ్రీ పాలేటి రామారావు గారి జవాబు - ఏ అధికారముతో ఆయన చెపుతున్నారు, ప్రవేట్ డాక్టర్లకు. అది మిగతావారికి తెలీదా, ఎమ్మెల్యే లేరా, ఎస్పీ లేరా, కమీషనర్ లేరా, అని ప్రశ్నించారు. ప్రభుత్వము చెప్పింది, బయట ఒపీలను తీసుకోవద్దని, కేవలము ఎమర్జెన్సీ కేసులు మాత్రమే తీసుకోమని అని జవాబు చెప్పారు.

b) చీరాల అమ్మ కంటి హాస్పటల్ అధినేత, వైసిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ వరికుటి అమృతపాణి గారి కౌంటర్ జవాబు - బాధ్యత అధికారములేని వ్యక్తి ఏదో చెపితే, మీరు మమ్మల్ని అడగటము ఏమిటి. ప్రభుత్వ అధికారులు చెపుతారు కదా ఎదైనా ఉంటే. మేము ఓపీ తీస్తే, మాకు కరోనా రావచ్చు, లేదా మేము జనానికి అంటించవచ్చు. అందుకే భారత ప్రభుత్వము చెప్పింది, మూయమని. అందరు ఇంట్లో ఉండమని, జాగ్రత్తలు తీసుకోమని. అవును ఇంట్లోనే కుటుంబముతో ఉన్నాము, ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పారు.


3) చీరాల లోని కొంత మంది ప్రైవేట్ డాక్టర్లకు నిన్న సూచన చేసాం.. నేడు హెచ్చరిక చేస్తున్నాం.. మీ నిర్లక్ష్యం వల్ల ఒక పసి కందు ప్రాణాలు కోల్పోయింది.. ఇక నైనా తీరు మార్చుకోకుంటే ప్రభుత్వ దృష్టి కి తీసుకెళ్లి కఠిన మైన చర్యలు తీసుకునే లా చేస్తాం.. దయ చేసి ప్రజలకి సేవ చేయండి.... ప్రజలకు సేవ చేసే వైద్యులకు మేము ఎప్పుడూ అండగానే ఉంటాము, కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చేతులు ఎత్తేసి, ఇంట్లో ఉండే వైద్యులను ఉపేక్షించం - ఆమంచి.

4) ఈ రోజు విలేఖరులతో (Apr 8th) మాట్లాడిన ఏయంసి చైర్మెన్ శ్రీ మార్పు గ్రెగొరీ గారు, అమృతపాణి మరియు పాలేటి గార్ల జవాబులకు, వివరణ ఇచ్చారు.

కరణం గారు, రాజీనామా చేయనంత వరకు, తను టీడీపీ ఎమ్మెల్యేనే, మా నాయకుడిని గౌరవించి మాట్లాడండి. అందరు డాక్టర్లను అనలేదు, కేవలము, తీయని వారి గురించే, అందులో మీరు ఉంటే, దేవుడి తర్వాత దేవుళ్ళు అయిన మీరే ఆలోచన చెయ్యండి.

- - -

మరి దీనికి, ఎస్పీ డిఎస్పీ సీఐ గార్లు మరియు ఎమ్మెల్యే కరణం ఎంపీ సురేష్ గారు ఏమంటారో చూడాలి.

ఎవరెవరు సేవ చేస్తున్నారో, మొత్తం ఎన్ని ప్రవేటు ఆసుపత్రులు , ఇప్పుడు ఎన్ని తెరిచారు. ఈ కష్ట సమయంలో, ఆసుపత్రులు తెరచిన (లేదా మూసిన) వారి ఆసుపత్రి పేర్లను ప్రకటిస్తే, ప్రజలకు మానవత్వం బాధ్యత ఉన్న, డాక్టర్లు ఎవరో వివరంగా తెలుస్తుంది కదా.

స్వార్థ వ్యాపార మనసు గల వైద్యులు ఎవరో కూడా బయటకు వస్తుంది కదా. రేపు, కరోనా తగ్గిన తర్వాత, ఆ ఆసుపత్రులకే జనం నమ్మి, వెళ్ళవచ్చు, మిగతా వాటిని వదిలి.

ఆమంచి మరియు కరణం గార్లు, ఆలోచన చెయ్యాలి. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగం. బాధ్యత గల డాక్టర్లు ఎవరెవరో, మన ఊరిలో అందరికీ తెలుస్తుంది కదా.

ఇలాగే, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు ఆగిపోతే, మన పరిస్థితి ఏమిటి? ఆలోచన చేయాలి ప్రతి ఒకరు, ప్రవేటు వైద్యులు కూడా.


ఇందులో రాజకీయాలు మనకు అనవసరము, అది నాయకులు చూసుకుంటారు. కానీ ఆసుపత్రులు తెరిచి ఉంచాలి అన్నది మాత్రము ప్రజా ఉపయోగము, తెరిచి ఉంచితే కదా, ఎవరన్న రోగులకు చెప్పేది, కేవలము ఎమర్జెన్సి కేసు తీసుకుంటాము అని. తెరవనప్పుడు సామాన్యుడైనా, ప్రశ్నించవచ్చును కదా, దానికి హోదాలు పదవులు కావాలా?

దయచేసి, మీ స్పందన కూడా తెలియజేయండి. ధన్యవాదాలు.

1. ఎస్మా ఉత్తర్వు లు పాటించి, ప్రతి ప్రవేటు ఆసుపత్రి తీసి ఉంచాలా? లేక కొంత మంది మూసివేయవచ్చా?

2. ఒక ఆసుపత్రి మూసి వేస్తే, ఎమర్జెన్సీ కేసుల తో జనం వస్తే, ఆ దగ్గర ఆసుపత్రికి జవాబు దారీ ఎవరు?

3. ఆసుపత్రి మూసి ఉంచితే, సామాన్య పౌరుడు కి అడిగే హక్కు లేదా? కేవలం అధికారులు లేదా అధికార నాయకులు మాత్రమే అడగాలా? వారు బిజీగా ఉండి అడగకపోతే , అప్పుడు దాకా ఆసుపత్రి మూస్తారా?

4. ఎవరో ఒకరు అధికారులు అడిగిన దాకా, ప్రవేట్ ఆసుపత్రి మూసి ఉంచితే, ఎస్మాను గౌరవించినట్లేనా? అది బాధ్యత గల ప్రవేట్ ఆసుపత్రి అవుతుందా? బాధ్యత గల డాక్టర్ అవుతారా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,263; 94 తత్వాలు (Tatvaalu) and views 184,787
Dt : 07-Apr-2020, Upd Dt : 07-Apr-2020, Category : News
Views : 914 ( + More Social Media views ), Id : 478 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona , kovid 19 , private hospitals closed , amanchi , paleti , chirala

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content