చంద్రన్న, సజ్జల వాదనలు రెఫరెండం ఎన్నికలకు. రైతుల బలి, రాజధానితో ఆటలు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,949; 104 తత్వాలు (Tatvaalu) and views 225,113.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ మీ రెండో అబ్బాయి తెదేపా, మూడో అబ్బాయి వైకాపా, వాదనలు విన్నారు కదా, అమరావతి రైతుల దగ్గర. రెఫరెండం పెట్టాలి అని ఒకరు, ఎన్నికలకు వెళ్ళండి అని ఇంకొకరు. తెదేపా చంద్రన్న, వైకాపా సజ్జల వాదన వీడియో కావాలంటే పంపుతా. ఎవరి వాదన కరెక్ట్. అందరూ కలసి రైతుల జీవితాలను బలి చేస్తున్నారు, రాజధానితో ఆటలు ఆడుతున్నారు, నవ్వులపాలు చేస్తున్నారు.

జవాబు, మా 4 రాజకీయ పిల్లలు, నీతి నియమాలు సభ్యత పాటించడం, ఎప్పుడో మానేసారు. ఎదురు వాదన, వితండ వాదం తప్ప, మంచి పని జరిగే విషయాలు, ఈ అరుపులు వాదనలు ఉండవు.

మొన్న అస్సెంబ్లీ జరిగిన విధానం చూసారు కదా, మన ఊళ్ళో మార్కెట్ లో, జరినంత ప్రశాంతముగా జరిగింది, అరుపులు తోపులాటలు లేకుండా కదూ? నవ్వుతారే?

ఇప్పుడు దానిని తప్పుగా ఎవరూ అనుకోవడం లేదు, ఎంత నీతి తప్పితే, అంత గౌరవం సంఘములో లాగా ఉంది. రేపు నాని గారికి, ఉత్తమ సంస్క్రుత వాచక అమాత్య, బిరుదు ఇవ్వవచ్చు ఏమో.

ఎందుకంటే, మనము కూడా, ఎంత ఎక్కువ అన్యాయం అక్రమం చేస్తే, వారినే, మన ఉత్తమ నాయకులు గా ఎన్నుకుంటాము. ప్రజలను బట్టే, మా 4 గురు రాజకీయ పిల్లలు చేష్టలు ఉంటాయి. మా పిల్లలను అంటే, బాగోదు మరి.

కొంత మంది పేరెంట్స్ గర్వముగా చెప్పుకుంటున్నారు, మా పిల్లలే ఆణిముత్యాలు 8 కి ముందు అసలు లెగవరు, మా నిద్ర పాడు చేయరు అండి, 9 కి నన్ను నిద్ర లేపుతారు, మా ఆయన కాఫీతో వచ్చాక అని. ధన ఉద్యోగ దురాశ తో చేసుకున్న వారికి చేసుకున్నంత.

కాగ్ అనే ప్రభుత్వ సంస్థ, నిర్భయముగా, మీరు ఇంత అప్పులు చేసి తగలేస్తున్నారు, మీ ఖర్చులు వ్రుధా, మీ పద్దతులు వాగ్దానాలు వ్రుధా అని తిడుతున్న ఊస్తున్నా కూడా, గత మరియు ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు కూడా పట్టించుకోకుండా, చెవిటి వాడి ముందు శంఖము లాగా ప్రవర్తిస్తున్నాయి. మరి కేంద్రం, కాగ్ అక్షింతలు వేసే, మేము మరలా ధనం ఇవ్వము అని ఎందుకు చెప్పరో తెలీదు. ఇంక కాగ్ రిపోర్ట్ వలన ఉపయోగం ఏమిటి?

మా రెండో అబ్బాయి తెదేపా, సీబీఐ ని రాష్ట్రం లో నిషేదించినపుడు మరియు అమరావతి పంట పొలాలను కాంక్రీట్ చేస్తున్నాం అని, రిఫరెండం పెట్టారా? వారు ఎన్నికలకు వెళ్ళారా? గెలిచిన తర్వాత నీతి మాట తప్పడము, ఏ అబ్బాయి అయినా ఒకటే కదా.

రాజధాని ని మార్చము అని కూడా, మూడో అబ్బాయి, అప్పుడు చెప్పారు. ఇప్పుడు అన్ని ఆఫీసులు తీసుకుని వెళ్ళి వైజాగ్ లో పెట్టి, బీచ్ వొడ్డున ఉంటా, అప్పుడప్పుడూ వచ్చి పోతా అమరావతి అంటున్నాడు, 151 సీట్ల అద్రుష్ట మత్తులో.

పెట్టుబడి దారులకు, 2 చోట్లా నష్టమే, నమ్మకం పోతుంది. ఎందుకంటే, రేపు మరలా రాజధాని ని, మరలా వీరు మారుస్తారు.

సామాన్యుడు కోటి పెట్టి, అమరావతి లో విజయవాడ లో వైజాగ్ లో, స్థలము కొని, ఇల్లు కట్ట గలడా? అంతా గందరగోళం, అస్తవ్యస్తం, గాలి లో మేడలు, ఫోటోలలో భవిష్యత్.

ఎప్పుడైనా, అన్యాయము జరిగినప్పుడు, మొదట స్పందించే పార్టీ, దేనికైనా సిద్దము గా ఉండాలి. అంటే, తెలంగాణా కోసం, కేసీయార్ ఎన్నో సార్లు, రాజీనామా చేసారు.

అలాగే మన తెదేపా రాజీనామా చేయాలి, ఎన్నికలలో నిరూపించుకోవాలి, తమ ఆవేదన ప్రజల ఆశయం, అని మనం ఎప్పుడో చెప్పాము. అది చంద్రన్న కు తెలుసూ, కానీ ఏమి చేస్తాము, రోజులు అలా వచ్చాయి. కాబట్టి, జవాబు వచ్చిందా?

కాకపోతే ఇప్పుడు రాజీనామా చేస్తే, ఇంకో కొత్త సమస్యలు వస్తాయి. అప్పుడు జగన్ హైదరాబాద్ లో ఉన్నారు, అమరావతి కి అస్సెంబ్లీ కి రాకుండా అని గేళి చేసి, మనము ఇప్పుడు అదే పని చేస్తున్నాము హైదరాబాద్ లో ఉంటూ.

అప్పుడు జగన్ రాజీనామాలు చేసారు అని ఎగతాళి చేసాము, అస్సెంబ్లీ లో ఉండకుండా. ఇప్పుడు మనము అదే పని చేస్తే, వైకాపా కూడా నవ్వుతుంది.

ఎన్ని గెలుస్తామో తెలీదు, ఉన్నవి పోగొట్టుకోవడం అవుతుంది. గమ్మున ఉన్నా, వైకాపా వాళ్ళు లాగుతున్నారు ఒక్కొక్కరిని. కాబట్టి రాజీనామా చేసి, పరువు నిలుపుకోవడమా? అంతా అగమ్యగోచరం, మనము చేసిన పనులు వెంటపడుతున్నాయి. ఈ పరిస్తితి చూసి కూడా, వీళ్ళు అదే పని చేస్తున్నారు, రేపు ఇదే పరిస్తితి లో ఉండటం కోసం.

కేసీయార్ అక్కడ, కాంగ్రెస్ ని భూస్తాపితం చేసి, బీజేపీ కి దొరికి పోతున్నారు ఇప్పుడు. మరి, ఆంధ్రా లో కూడా, తెదేపా ను తుడిచి పెట్టి, బీజేపీ తో ఢీ కొంటారా, అంటే తనే స్వయముగా బీజేపీ కి మార్గం సుగమం చేస్తారా?

ఆఖరికి తెలుగు నేల పై బీజేపీ పై ఉన్న కోపం తో, అనంతపూర్ నుంచి రైతుల లోడు రైలు డిల్లీ వెళ్ళి అమ్మి లాభం చేసినా కూడా, కాంగ్రెస్స్ ఖలిస్తాన్ విదేశీ పెట్టుబడి దారుల మద్దతుతో సాగుతున్న, ధర్నాలకు మన తెలుగు వారు కూడా, అమాయకముగా అండ గా ఉంటున్నారు అని కొందరు అంటున్నారు. ఏది నిజం, ఏది అబద్దం, అంతా మాయాజాలం.

కాబట్టి, ముందు నుయ్యి వెనక గొయ్యి. జనం గా మనమెంత బాధ్యత గా ఉన్నామో, నాయకులు అంతే బాధ్యత గా ఉనారు, నవ్వొద్దు మరి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,949; 104 తత్వాలు (Tatvaalu) and views 225,113
Dt : 21-Dec-2020, Upd Dt : 21-Dec-2020, Category : Politics
Views : 704 ( + More Social Media views ), Id : 876 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chandranna , sajjala , arguments , referendum , elections , sacrifice , farmers , capital games
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content