మోహం వ్యామోహం అంటారు కదా, నేటి ఆంధ్రా రాజకీయ పార్టీల ఇప్పటి పరిస్తితులు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1728 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1763 General Articles and views 1,274,370; 90 తత్వాలు (Tatvaalu) and views 175,285.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* నేను ఒక్కడినే ఉంటాను అంటే, అది నియంత పాలన
* బెడ్లు సరైన వైద్యం దొరక్క, కరోనా దెబ్బకు జనం, ఎమ్మెల్యేలు
* ఈ 151 మార్క్ నిలుపు కుంటూ, చంద్రన్న ఎక్కడ దెబ్బ తిన్నారో
* చంద్రన్న ను ప్రతిపక్ష నాయకుని
* స్థానిక ఎలెక్షన్ కావాలని ఫిబ్రవరిలో పరుగులు, కమీషనర్ ని
* కరోనా సమయములో అండగా ఉండాల్సిన చంద్రన్న లోకెష్, హైదరాబద్, ట్విట్టర్ వీరుడు
* అమరావతి పెద్ద సమస్య, ఆ తర్వాత గుడులు అనుకుంటూ
* బీజేపీ జనసేన - ఆన్లైన్ మాటలు ఎక్కువ, ఆన్సైట్ పని తక్కువ
1 min read time.

గతములోనే మనము చెప్పాము - జగనన్న, చంద్రన్న, పవనన్న, వీరన్న అందరినీ మంత్రిలా మనము పొగడాలి, అందరూ బాగుండాలి. సంస్కారముతో సుతి మెత్త గా తెగడాలి, వ్యక్తిగత జీవితాల గురించి పోకుండా, వారి మరియు అభిమానుల మరియు ప్రజల మంచి కోసం. అదీ పార్టీ బాగుకోసమే, పదేళ్ళు పైన నిలబడటానికి మాత్రమే. రాజకీయ ఆటలో అందరూ ఉండి, అందరూ పాల్గొంటెనే మజా ఉంటుంది. అందరినీ తీసేసి, నేను ఒక్కడినే ఉంటాను అంటే, అది నియంత పాలన అవుతుంది. అలా ప్రయత్నం చేసిన, పార్టీల పరిస్తితి నేడు చూస్తున్నాము.

కక్కుర్తి పడేవారికోసమే ఓ సామెత - ఉన్నదీ పోయే, . . . అని. అలాగే పరుగెత్తి పాలు తాగే కన్నా, నిలబడి నీళ్ళు మేలు. అలా ఎప్పుడు ఉండకూడదు, అదే మోహం, అదే వ్యామోహం జీవితములో అయినా, వ్యాపారమైనా, రాజకీయమైనా, కాదంటావా మిత్రమా? గతములో, తేదేపా వారు, చాదస్తపు మాటలు మేము ఒప్పుకోము అన్నారు, ఇప్పుడు వారి పరిస్తితి ఏమిటి?

1. వైకాపా - ఊహించని గెలుపు సంఖ్య మత్తులో ఉండి, జగనన్నను పూర్తిగా మైకములో ఉంచుతున్నారు, బయట వాస్తవాలు తెలియనీయకుండా. అంతా మనదే రాజ్యం, ప్రజలు హాపీ అని అబద్దాలు చెపుతున్నారు. బెడ్లు మరియు సరైన వైద్యం దొరక్క, కరోనా దెబ్బకు జనం హాహా కారాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు వైద్యానికి, పక్క రాష్ట్రాలకు పోతున్నారు, ఆంధ్రా వైద్యం నమ్మకం లేక. పన్నులు పెరిగాయి. కరెంట్ చార్జీలు ఎక్కువ వచ్చాయి మధ్యలో.

151 మంది ఎమ్మెల్యేలను దేవుడు ఇచ్చారు అంటే, ఆఖరికి జగనన్నకు కూడా అది ఊహించని విజయము, అంటే తేదేపా పై అంత అసహ్యముతో ఉన్నారు. మనము అప్పుడు ఏమి చెయ్యాలి, ఈ 151 మార్క్ నిలుపు కుంటూ, చంద్రన్న ఎక్కడ దెబ్బ తిన్నారో తెలుసుకుని, మనము అదే స్థితికి పోకూడదు.

కాని ప్రజలకు ఉన్న ఇబ్బందులు అలా పక్కన పెట్టి, డబ్బులు అప్పులు తెచ్చి పంచుకుంటూ పోతూ, నేల కట్టడాలు మొదలు పెట్టకుండా, తేదేపా ను ఖాళీ చేయాలని మొదలు పెట్టారు, ఇవి అనవసర ప్రయత్నాలు. దానివలన, చంద్రన్న కు సింపతి పెరుగుతుంది అని గ్రహించడము లేదు.

మన అభివ్రుద్ది చూసి, తేదేపా 23 మంది ఎమ్మెల్యేలు బాధపడాలి, జనము మరలా మనకే ఓటు వేయాలి అన్నది వదిలేసి, ఎమ్మెల్యేలను లాగడం ఒక్కటే పని లో ఉన్నారు.

చంద్రన్న ను ప్రతిపక్ష నాయకుని హోదా లాగేసి, అవమానించాలని ప్రయత్నం. కొందరి పుత్రులకి పార్టీ కండువా కప్పి, మాట మడము తప్పారు. ఒంటెద్దు పోకడ ఎవరికీ, కలిసి రాలేదు. ఇదే గాక, ప్రతి నియోజక వర్గాలలో కొత్త పాత గ్రూప్ లు మొదలై, తగువులు పెరిగాయి. వంశీ, కరణం ఉదాహరణలు.

స్థానిక ఎలెక్షన్ కావాలని ఫిబ్రవరిలో పరుగులు తీసి, కమీషనర్ ని తొలిగించి కోర్టు తొ చెప్పించుకుని, మరలా పదవి కట్టబెట్టి, ఇప్పుడు, ఎన్నికలు వద్దు అంటున్నారు, ఎన్నికల కమీషనర్ తో తలనొప్పి అని, వెనక్కు తగ్గినట్టె కదా, అనవసరపు గొడవలు పెంచుకుని?

కోర్టులతో లెక్కలేనన్ని చివాట్లు. ఇవన్నీ, మోహము వ్యామోహము తో చేస్తున్న పనులు. భవిష్యత్ లో మనల్నే ఇబ్బంది పెడుతాయి. ఎక్కువగా జగనన్నను కలిసే, సలహా దారులు మరియు మంత్రులు, జగనన్న ను మాయ చేస్తున్నారు.

2. తేదేపా - కరోనా సమయములో అండగా ఉండాల్సిన చంద్రన్న లోకెష్, హైదరాబాద్ కి పరిమితము, స్థానిక నాయకులు, గప్ చుప్. ప్రభుత్వ ఆసుపత్రిలలో లోపాలు ఎత్తి చూపి మరియు స్థానిక సమస్యలపై పోరాడుతూ, రోజూ, మీడియాలో ఉండాల్సిన వారు, జూం మీటింగులతో కాలం గడుపుతున్నారు.

అమరావతి అతి పెద్ద సమస్య గా, ఆ తర్వాత గుడులు సమస్య గా, అనుకుంటూ రోజులు నెడుతున్నారు. యువకుడు లోకేష్ కూడా, తండ్రి బదులు ప్రజలలో తిరగకుండా, జనాలకు దూరముగా ఉండి, ట్విట్టర్ వీరుడు గా కొనసాగుతున్నారు.

హైదరాబాద్ వ్యాపారం మీద వ్యామోహం, కొడుకు రాజకీయ జీవితం మీద వ్యామోహముతో, చంద్రన్న ఏమి చేస్తున్నారో కూడా అర్ధము గాక, అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. పార్టీ నాయకులు, ప్రజల ద్రుష్టిలో పలచన అయ్యారు.

కరోనా భయముతో, అందరు అన్ని స్థాయిలలో, తేదేపా నాయకులు, ప్రజలకు మొహము చాటు చేస్తున్నారు. పార్లమెంట్ నాయకులను ప్రకటించారు, అందరు చప్పుడు చేయకుండా కూర్చున్నారు. అస్సెంబ్లీ నాయకులను ప్రకటించే ధైర్యం లేదు.

3. బీజేపీ జనసేన - ఆన్లైన్ మాటలు ఎక్కువ, ఆన్సైట్ పని తక్కువ. రాజధాని లో కూర్చుని, స్టేట్మెంట్లు, కాంఫరెన్సులు తో సరిపోతుంది. స్థానిక సమస్యలు మరియు ప్రభుత్వ ఆసుపత్రి లోపాలు, వీరు పట్టించుకోరు. ఈ 10 ఏళ్ళు గా ఉన్న నిర్లప్తతే కొనసాగుతుంది.

వైకాపా తేదేపా తో విసిగిపోయిన జనాలు, ఆటోమాటిక్ గా తమను ఆదరిస్తారు అని, భ్రమలలో కలలు కంటున్నారు, రాజధాని అమరావతి లో కూర్చుని. కష్టపడి పని చేస్తేనే అది వస్తుంది అని తెలిసీ, వారు స్థానిక నాయకులతో స్థానిక సమస్యలపై, పోరాటము చేయడము లేదు.

వీరన్న వచ్చినా, స్థానిక నాయకులలో చలనము లేదు, గుడుల సమస్యల దగ్గర తప్ప.

కనీసము పోటీలో కూడా లేరు, జగనన్న చంద్రన్న లకు, స్థానిక బలమైన నాయకత్వము లేదు, పెంచుకోరు.

మోదీ గారి పేరు చెప్పుకుని నిద్రమత్తు లో ఉండే, బీజేపీ జనసేన నాయకులు, ప్రజలతో కలవలేరు. కేంద్ర పార్టీ పదవులలోకి, ఆంధ్రా నుంచి తీసుకున్న వారి గొంతు వినపడటము లేదు, వారు స్థానికముగా పేరు ఉన్న నాయకులు కాదు. ఇలా ఉంటాయి బీజేపీ పనులు. ఎదగమంటే, ఎలా ఎదుగుతుంది? వాజ్పేయి పేరు చెప్పుకుని అప్పుడు కాలం వెళ్ళబుచ్చారు. ఇప్పుడు మోదీ పేరుతో నెడుతున్నారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1763 General Articles and views 1,274,370; 90 తత్వాలు (Tatvaalu) and views 175,285
Dt : 10-Oct-2020, Upd Dt : 10-Oct-2020, Category : Politics
Views : 536 ( + More Social Media views ), Id : 748 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , political , parties , passion , fascination , imagination , today
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content